Rape statistics in India: అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!

author img

By

Published : Sep 17, 2021, 11:40 AM IST

Updated : Sep 17, 2021, 12:00 PM IST

NCRB report

మహిళలపై అత్యాచారాలు, హత్యలు (Rape statistics in India) మెట్రో నగరాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)(NCRB report 2020) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన హత్యాచార ఘటనల్లో 40 శాతం ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయని నివేదికలో వెల్లడైంది.

ఇటీవల కాలంలో హత్యాచార ఘటనలు (Rape statistics in India) దేశ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)(NCRB report 2020) పలు కీలక విషయాలు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల్లో జరుగుతున్న నేరాలను బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది.

కొవిడ్, లాక్‌డౌన్లతో సతమతమైన 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,533 అత్యాచార(India crime news), 1,849 హత్య ఘటనలు(india crime rate 2020) వెలుగులోకి వచ్చాయి. వాటిలో దాదాపు 40 శాతం అత్యాచార, 25 శాతం హత్య కేసులు(Rape statistics in India) ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన 19 మహానగరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ లెక్కలను వెలువరించింది. హత్య కేసుల్లో తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, సూరత్ ఉన్నాయి. అయితే ముందు సంవత్సరంతో పోల్చితే నేరాల రేటు కాస్త తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.

ఇక దిల్లీలో 967 అత్యాచార ఘటనలు జరగ్గా.. జైపూర్, ముంబయి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యాచార బాధితుల్లో 2,448 మంది 18 ఏళ్లు పైడినవారు కాగా.. మిగిలిన వారు మైనర్లు. మరోపక్క దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 35,331. ముందు సంవత్సరంతో పోల్చితే 21.1 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. మగువలపై జరిగిన 30 శాతం నేరాలకు భర్త, అయినవాళ్లే కారణమయ్యారని ఆ నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: Modi Birthday Celebrations: 71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూ

Last Updated :Sep 17, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.