ETV Bharat / bharat

భార్య, కుమారుడి హత్య.. వాట్సాప్​ గ్రూప్​లో మెసేజ్​ చేసి మరీ..

author img

By

Published : Apr 17, 2022, 12:42 PM IST

whatsapp group
వాట్సాప్​ గ్రూప్​లో వివరాలు

Man Kills Wife: శ్వాస ఆడనివ్వకుండా చేసి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్​లో ఈ హత్య వివరాలు షేర్​ చేశాడు. దిల్లీలోని శాహ్​దరా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Man Kills Wife: దిల్లీ శాద్​హరా ప్రాంతంలోని గీతా కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. తన భార్య, కుమారుడిని హత్య చేశాడు. అనంతరం తాను హత్యకు పాల్పడినట్లు వాట్సాప్​ ఫ్యామిలీ గ్రూప్​లో వివరాలు షేర్​ చేసి పరారయ్యేందుకు యత్నించాడు. శనివారం మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు ఈ ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గీతా కాలనీకి చెందిన సచిన్​ స్థానికంగా ఓ కిరాణ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తీవ్ర నష్టాలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తడికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం.. భార్య కాంచన్​ అరోడాతో (35) గొడవ పడిన సచిన్​.. ఆమెకు, కుమారుడికి (15) ఊపిరి ఆడనివ్వకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని ఫ్యామిలీ గ్రూప్​లో షేర్​ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడి సమాచారంతో అప్రమత్తమైన బంధువులు ఆ వివరాలను పోలీసులకు అందించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టగా.. సచిన్​ ఈ వివరాలు వెల్లడించాడు.

ఇదీ చూడండి : కుమారుడితో ఆడుకుంటూ.. అలల్లో కొట్టుకుపోయిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.