ETV Bharat / bharat

మద్యం బాటిల్​లో చనిపోయిన కప్ప.. ప్రభుత్వ దుకాణంలో కొన్న వ్యక్తికి షాక్

author img

By

Published : Oct 25, 2022, 1:56 PM IST

మద్యం బాటిల్​లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. వినియోగదారుడు.. వైన్ షాపు నిర్వాహకుడికి ఫిర్యాదు చేయగా అతడు ఏమన్నాడంటే?

dead frog in wine bottle
వైన్ బాటిల్ కప్ప

​ఛత్తీస్​గఢ్​లోని కోర్భాలో ఓ వింత ఘటన జరిగింది. మద్యం సీసాలో చనిపోయిన కప్ప కనిపించింది. ఈ ఘటనపై మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి.. దుకాణం నిర్వాహకుడికి ఫిర్యాదు చేయగా అతడు వినియోగదారుడికి వేరే మద్యం బాటిల్​ను ఇచ్చాడు.

ఇదీ జరిగింది..
హార్దిబజార్​లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఓ యువకుడు మద్యం కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ ఓపెన్ చేసేసరికి లోపల చనిపోయిన కప్ప కనిపించింది. ఆ తర్వాత వైన్ షాపునకు వెళ్లి సేల్స్​మ్యాన్​కు ఫిర్యాదు చేశాడు. ఇంతలో జనం గుమిగూడి మద్యం నాణ్యతపై ప్రశ్నించారు. గోదాం నుంచి మద్యం వస్తుందని.. తనిఖీ చేసి వినియోగదారులకు ఇస్తామని వైన్ షాపు నిర్వాహకుడు అమిత్ రాఠోడ్ తెలిపాడు. ఇలాంటి ఘటన ఇంతకుముందు జరగలేదని అన్నాడు.

dead frog in wine bottle
మద్యం సీసాలో చనిపోయిన కప్ప

ఇవీ చదవండి: భార్య గొంతు కోసి హత్య.. శవాన్ని ప్లాస్టిక్ కవర్​లో చుట్టి భర్త పరార్

తుపాకీతో బెదిరిస్తున్న దొంగ సంగతి తేల్చిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.