ETV Bharat / bharat

ఆగని మరణాలు- మరో 4,194 మంది వైరస్​కు బలి

author img

By

Published : May 22, 2021, 9:25 AM IST

Updated : May 22, 2021, 9:52 AM IST

దేశంలో మరోసారి నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 2.57 లక్షల మందికి వైరస్ సోకిందని తెలిపింది.

INDIA CASES
ఇండియా కరోనా కేసులు

దేశంలో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. శుక్రవారం సైతం నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 4,194మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

అటు వైరస్ విజృంభణ సైతం కొనసాగుతోంది. మరో 2,57,299‬లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630మంది తాజాగా కోలుకున్నారు.

ఇదీ చదవండి: టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?

  • మొత్తం కేసులు: 2,62,89,290‬
  • మరణాలు: 2,95,525‬
  • మొత్తం రికవరీలు: 2,30,70,365
  • యాక్టివ్ కేసులు: 29,23,400‬
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

పరీక్షలు

శుక్రవారం సైతం 20 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరిగాయి. మొత్తం 20,66,285 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం 20,61,683 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 32,64,84,155కు చేరింది.

ఇదీ చదవండి: టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వ్యాక్సినేషన్

మరోవైపు, దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 14,58,895 డోసులను శుక్రవారం లబ్ధిదారులకు అందించింది. దీంతో 19,33,72,819 డోసుల పంపిణీ పూర్తయింది.

ఇదీ చదవండి: కొవాగ్జిన్​, కొవిషీల్డ్, స్పుత్నిక్​-వి మధ్య తేడా ఏంటి?

Last Updated : May 22, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.