ETV Bharat / bharat

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Nov 27, 2020, 10:52 AM IST

Updated : Nov 27, 2020, 11:16 AM IST

దేశంలో కొత్తగా 43,082 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 93లక్షల 9వేల 788కి చేరింది. వైరస్​ కారణంగా మరో 492 మంది మృతిచెందారు.

COVID-19
దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో రోజూ స్థిరంగా 40 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 43 వేల 82 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 9వేల 788కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 524 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 35వేల 715కు చేరింది.

Statewide corona case details
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 87లక్షల 18వేల 517 మంది కోలుకున్నారు. 4లక్షల 55వేల 555 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: భారత్​లో ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​పై సీరం క్లారిటీ

Last Updated : Nov 27, 2020, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.