ETV Bharat / bharat

Court Verdict After 49 Years : 49 ఏళ్ల నాటి కేసులో తీర్పు.. 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు.. ఆపై జరిమానా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 8:30 AM IST

Updated : Oct 13, 2023, 9:19 AM IST

Court Verdict After 49 Years
Court Verdict After 49 Years

Court Verdict After 49 Years : 49 ఏళ్ల నాటి కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ కోర్టు. దీంతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా రుసుము చెల్లించకపోతే మరో ఏడాది శిక్ష అనుభవించాలని హెచ్చరించింది.

Court Verdict After 49 Years : 49 ఏళ్ల నాటి కేసులో ఎట్టకేలకు తీర్పునిచ్చింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ కోర్టు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఓ మహిళను కాల్చి చంపిన కేసులో.. 80 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పును ఇచ్చింది.

బాధితురాలి తరఫున లాయర్​ చెప్పిన వివరాల ప్రకారం.. మహేంద్ర సింగ్​ అనే వ్యక్తి నార్​ఖీ ప్రాంతంలో నివసించేవాడు. అతడు 1974 సెప్టెంబర్ 14న రామ్​బేటీలోని ఓ మహిళను ఆమె భర్త వద్దనున్న రైఫిల్​ తీసుకుని కాల్చి చంపాడు. అనంతరం ఆమె కుమార్తె మీరా దేవీ.. మహేంద్ర సింగ్​పై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసింది. అప్పుడు నార్​ఖీ.. ఆగ్రా కోర్టు పరిధిలో ఉండడం వల్ల.. అక్కడ చాలా కాలం పాటు పెండింగ్​లో ఉంది. కొంత కాలం క్రితం ఆ కేసు ఫిరోజాబాద్​కు బదిలీ అయింది.

దీంతో జిల్లా అడిషనల్​ డిస్ట్రిక్ గవర్నమెంట్​ కౌన్సిల్​- ఏడీజీసీ శ్రీనారాయణ్ శర్మ ఈ కేసులో విచారణ చేపట్టారు. అయితే విచారణ సమయంలో పలు వాంగ్మూలాలను, అధారాలను న్యాయమూర్తి ముందు ఉంచామని బాధితురాలి తరఫున న్యాయవాది తెలిపారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు మహేంద్ర సింగ్​ను దోషిగా తేల్చుతూ జీవిత ఖైదు శిక్ష వేస్తూ తీర్పు వెలువరించిందని చెప్పారు. దీంతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించిందని.. అవి చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించిందని వెల్లడించారు.

బాలికపై తండ్రి అత్యాచారం​.. కోర్టు జీవిత ఖైదు..
మైనర్​పై కూతురుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ 55 ఏళ్ల తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది రాజస్థాన్​లోని కోటా పోక్సో కోర్టు. ఈ ఘటనను సభ్య సమాజం సిగ్గుపడే చర్యగా అభివర్ణించిన కోర్టు.. రూ.10 వేల జరిమానా విధించింది.

ఇదీ జరిగింది
ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న బాధితురాలు.. తన తండ్రి తనపై 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. చివరగా ఈ ఏడాది మార్చి 9న అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. తాను అంగీకరించకుంటే.. తన తల్లికి విడాకులు ఇస్తానని బెదిరించాడని పేర్కొంది. బాధితురాలు మైనర్​గా ఉన్నప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడుతుండటం వల్ల నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 7 నెలల విచారణ తర్వాత నిందితుడికి జీవిత ఖైదు విధించింది పోక్సో కోర్టు.

10 ఏళ్ల బాలుడి హత్య.. 29 ఏళ్ల తర్వాత తీర్పు.. దోషికి జీవిత ఖైదు

అవినీతి కేసులో 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు

Last Updated :Oct 13, 2023, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.