ETV Bharat / bharat

దేశంలో మరో 19,078 కేసులు, 224 మరణాలు

author img

By

Published : Jan 2, 2021, 9:45 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 3 లక్షల 5 వేలు దాటింది. దేశంలోని 5 రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

corona cases
కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20 వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. శుక్రవారం నుంచి శనివారం ఉదయానికి కొత్తగా 19,078 కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 22,926 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,03,05,788
  • క్రియాశీల కేసులు: 2,50,183
  • కోలుకున్నవారు: 99,06,387
  • మరణాలు: 1,49,218

5 రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్​ కేసులు

దేశంలో కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోనే 62 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.08 శాతం, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్​ కేసులు 2.47 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

corona cases
కరోనా యాక్టివ్​ కేసుల వివరాలు

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.