ETV Bharat / bharat

వచ్చే ఏడాది డిసెంబర్​లోనే అయోధ్య రాముడి దర్శనం

author img

By

Published : Aug 13, 2022, 10:54 PM IST

Ram Temple Construction వచ్చే ఏడాది డిసెంబర్​లోగా అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి.

Construction of Ram temple to be over by December next year: Champat Rai
Construction of Ram temple to be over by December next year: Champat Rai

Ram Temple Construction: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 డిసెంబర్​లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​. సుల్తాన్​పుర్​లో రక్షా బంధన్​ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల్లోనే పెద్ద ఆలయంలో రామ్​ లల్లాను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.

'అయోధ్యకు సుల్తాన్​పుర్​ సమీపంలోనే ఉన్నందున.. వచ్చే ఏడాది డిసెంబర్​లో శ్రీరామ్​ లల్లాను దర్శించుకోవాలని మీకు ఆహ్వానం పలుకుతున్నా' అని సుల్తాన్​పుర్​ ప్రజలకు చెప్పారు రాయ్​. ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడట్లేదని.. అయితే ఆలయ డిజైన్​ చూసి ప్రజలు ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. రామ మందిరం నిర్మాణ పనుల్ని చూసుకునేందుకు.. కేంద్రం శ్రీ రామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ను నియమించింది. వచ్చే ఏడాది చివరి నాటికి గుడిని పూర్తి చేయాలని ట్రస్ట్ గడువు పెట్టుకుంది.

2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఇవీ చూడండి: 'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'

అయోధ్యలో ఇసుకతో రామాయణం చెప్పిన సైకతశిల్పి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.