ETV Bharat / bharat

పంజాబ్​లో 'దళిత' అస్త్రం- యూపీ​లో కాంగ్రెస్​కు లాభం!

author img

By

Published : Sep 24, 2021, 2:00 PM IST

UP congress
ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల(uttar pradesh election 2022) కోసం పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసారి ఉత్తర్​ప్రదేశ్​లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది కాంగ్రెస్​. అయితే ఇటీవలే పంజాబ్​లో సీఎంను మార్చిన కాంగ్రెస్​.. ఆ రాష్ట్ర ఎన్నికల ముందు 'దళిత' అస్త్రాన్ని ప్రయోగించింది. ఎన్నికల్లో ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ధీమాగా ఉంది. అయితే పంజాబ్​లో దళిత వ్యూహం.. ఉత్తర్​ప్రదేశ్​లోనూ పనికొస్తుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. మరి కాంగ్రెస్​ వ్యూహం ఉత్తర్​ప్రదేశ్​లో ఫలిస్తుందా?

పంజాబ్​ సీఎంగా ఓ దళిత నేతను కాంగ్రెస్(punjab congress news)​ ఎన్నుకోవడం వల్ల రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి(congress news india). కాంగ్రెస్​ 'దళిత' అస్త్రం ఇతర రాష్ట్రాలపైనా, ముఖ్యంగా రానున్న నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​పై(uttar pradesh election 2022) ప్రభావం చూపించే అవకాశముంది. పంజాబ్​లో దళిత సీఎం ఉండటం వల్ల ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో కాంగ్రెస్​కు లబ్ధిచేకూరుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయంపై యూపీ కాంగ్రెస్​ నేత వివేక్​ బన్సల్(up congress news)​ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. 'కాంగ్రెస్​ ఓ జాతీయస్థాయి పార్టీ. అందువల్ల ఒక రాష్ట్రంలో కాంగ్రెస్​ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా ఉంటుంది. ఓటుబ్యాంకు పరంగా ఉత్తర్​ప్రదేశ్​లో వీటి ప్రభావం చాలా ఉంటుంది. ఎస్​సీ, ఓబీసీ వర్గంపైనే ఇది కీలకంగా ఉండే అవకాశముంది' అని విశ్లేషించారు.

పోటీ తప్పదు!

పంజాబ్​తో పోల్చుకుంటే ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ 'దళిత' అస్త్రానికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) ఇందుకు కారణం(up bsp news). రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పటికే దళితుల ఓటు బ్యాంకు బలంగా ఉంది. దీనితో పాటు ఇప్పుడు బ్రాహ్మణులను కూడా తమవైపు తిప్పుకోవాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్​పీ ప్రణాళికలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో దళితులు-బ్రాహ్మణుల సామాజిక వర్గాల అండతో విజయం సాధించాలని ఆశిస్తోంది. నిజానికి బీఎస్​పీకి ఇది కొత్తేమీ కాదు. 2007లో ఇదే అస్త్రాన్ని ప్రయోగించి గెలుపొందింది.

ఇదీ చూడండి:- ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

మరోవైపు బీఎస్​పీ ప్రణాళికలను విమర్శించే వారూ ఉన్నారు. బ్రాహ్మణుల మాట పక్కనపెడితే.. దళితుల్లోనే ఆ పార్టీ పట్టుకోల్పోతోందన్నది వీరి వాదన.

"ఇతర కులాలు, వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు బీఎస్​పీ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ సొంత కేడర్​లోనే ఆ పార్టీ ఉనికిని కోల్పోతోంది. అటు బ్రాహ్మణ సమాజంతో పాటు ఇతర వర్గాలు కూడా బీఎస్​పీపై అసంతృప్తితోనే ఉన్నాయి. ఒక వర్గాన్నే పట్టించుకుని, ఇన్నేళ్లు తమను దూరంపెట్టారని మండిపడుతున్నాయి. అదే సమయంలో వారికి అధికారపక్షం(భాజపా)తో స్నేహబంధం ఉండటం బీఎస్​పీకి చేటుచేస్తోంది."

-- వివేక్​ బన్సల్​, కాంగ్రెస్​ నేత.

వాస్తవానికి ఈ విషయంలో కాంగ్రెస్​కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్​ సీనియర్​ నేత, పార్టీలో బ్రాహ్మణ సమాజానికి ముఖచిత్రంగా ఇన్నేళ్లు ఉన్న జితిన్​ ప్రసాద్​.. అనూహ్యంగా భాజపాలో చేరారు.

అయితే జితిన్​ ప్రసాద్​ పార్టీ మార్పుతో కాంగ్రెస్​కు నష్టమన్న వ్యాఖ్యలను వివేక్​ బన్సల్​ కొట్టిపారేశారు.

"ఏ ఒక్కరిపైనా పార్టీ ఆధారపడదు. అందరికన్నా పార్టీయే పెద్దది. పార్టీలో వ్యక్తి ప్రభావం కొంతే ఉంటుంది. తమను పట్టించుకోవడం లేదని ఆ సమాజం ప్రజలు అనుకుంటున్నారు. ఆ నేత వెళ్లిపోయినంత మాత్రాన వారి పరిస్థితి మారదు. వాస్తవానికి, ఆ నేతకు బయట పేరు ఉందే తప్ప, సొంత ప్రజలపై ఆయన ప్రభావం చాలా తక్కువ."

-- వివేక్​ బన్సల్​, కాంగ్రెస్​ నేత

కాంగ్రెస్​-ఎస్​పీ పొత్తు?

పంజాబ్​లో 'దళిత' కార్డుతో కాంగ్రెస్​వైపు ఇతర పార్టీలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​తో పొత్తుకు ఎస్​పీ(సమాజ్​వాది పార్టీ) యోచిస్తున్నట్టు సమాచారం(up sp news). మరోవైపు దళితులను ఆకట్టుకునేందుకు భీమ్​ ఆర్మీ చీఫ్​ చంద్రశేఖర్​ ఆజాద్​తో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news) చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరి కాంగ్రెస్​ 'దళిత' అస్త్రం ఫలిస్తుందా? ప్రజలు కాంగ్రెస్​కు పట్టంగడతారా? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!

ఇదీ చూడండి:- మారుతున్న వ్యూహాలు- యూపీ, బిహార్లలో నయా కుల సమీకరణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.