ETV Bharat / bharat

ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

author img

By

Published : Sep 21, 2021, 2:55 PM IST

Assembly Election 2022
పంజాబ్​ దళిత రాజకీయం

2022 అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Election 2022) ముందు.. మరోసారి కుల రాజకీయాల (Caste politics) అంశం హాట్​టాపిక్​గా మారింది. పంజాబ్​ తొలి దళిత ముఖ్యమంత్రిగా (Punjab CM news) చరణ్​జీత్​ సింగ్​ చన్నీ.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇది ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యేలా లేదు.. దేశంలో ప్రస్తుతం దళిత ముఖ్యమంత్రిగా ఉన్నది చన్నీ ఒక్కరే. అందుకే.. కాంగ్రెస్​ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ఇదో ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణిస్తున్నాయి దేశంలోని ఇతర ప్రధాన పార్టీలు. అప్పుడే మాటల దాడిని పెంచాయి. మరికొద్దినెలల్లో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ కుల సమీకరణాల రాజకీయాలు ఎవరికి లాభించనున్నాయో మరి..?

పంజాబ్​ కొత్త ముఖ్యమంత్రిగా (Punjab CM news) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు చరణ్​జీత్​ సింగ్​ చన్నీ (Charanjit Singh Channi Cast). అయితే ఇదిప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. కారణం.. ఆయన దళితుడు కావడం. దేశంలో ప్రస్తుతం ఉన్న ఏకైక దళిత సీఎం చన్నీనే (Dalit CM in India). ఇంకా.. పంజాబ్​కు కూడా ఆయనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఇది పంజాబ్​కు మాత్రమే పరిమితం కాలేదు. దేశ రాజకీయాల్లోనూ హాట్​టాపిక్​గా మారింది.

చన్నీ నియామకంతో.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు (Assembly Election 2022) మరోసారి కుల రాజకీయాలు (Caste Politics) తెరమీదకు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్​సీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని కాంగ్రెస్.. ముఖ్యమంత్రిని చేయడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సూత్రం అమలయ్యేందుకు బాటలు పడ్డాయని, ఇది స్వాగతించదగ్గ పరిణామమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే.. చన్నీ ఎంపికను (Channi Caste in Punjab) ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు స్వాగతిస్తూనే.. కాంగ్రెస్​ను తూర్పారపట్టాయి.

ఎన్నికల గిమ్మిక్కే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) అధినేత్రి మాయావతి (Mayawati news), సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ) చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) ​నేత భగవంత్​ మన్​ సహా పలువురు చన్నీ నియామకంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు.. దళితుల ఓట్లను చేజిక్కించుకునే ఉద్దేశంతోనే (Assembly Election 2022) చన్నీకి కాంగ్రెస్​ అవకాశం కల్పించిందని విమర్శించాయి భాజపా, బీఎస్​పీ.

చన్నీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కాంగ్రెస్​కు (Punjab Congress news) తొలి సవాల్ ఆ పార్టీ నుంచే వచ్చింది. నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ ఆధ్వర్యంలోనే​ అసెంబ్లీ​ ఎన్నికలకు వెళ్తుందని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి​.

''చరణజీత్​ చన్నీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే.. 'సిద్ధూ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తాం' అని హరీశ్​ రావత్​ చేసిన ప్రకటన గందరగోళానికి గురిచేస్తోంది. ఇది సీఎం అధికారాన్ని తగ్గించడం, ముఖ్యమంత్రి పీఠాన్ని అవమానించడమే.''

- సునీల్​ జాఖడ్​, పంజాబ్​ పీసీసీ మాజీ చీఫ్​

దళిత సీఎం.. నైట్​ వాచ్​మెన్​..!

ఇదే తరుణంలో.. కాంగ్రెస్​పై మాటల దాడిని పెంచింది భాజపా. ప్రస్తుత దళిత సీఎం పోస్టును నైట్​ వాచ్​మెన్​తో పోల్చింది.

''గాంధీ కుటుంబ విధేయుడైన నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ బాధ్యతలు స్వీకరించేవరకు .. దళిత సీఎంగా నైట్​ వాచ్​మెన్​ పదవిలో ఉంటారు.''

- అమిత్​ మాలవీయ, భాజపా ఐటీ విభాగం అధిపతి

కాంగ్రెస్​, భాజపా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు బీఎస్​పీ అధినేత్రి (BSP news) మాయావతి.

''పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​, ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు.. దళితులు, ఓబీసీల పేర్లు చెప్పుకొని కాంగ్రెస్​, భాజపా కుల రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు.. దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం.. ఎన్నికల స్టంట్​ అనే చెప్పొచ్చు. పంజాబ్​లో​ అసెంబ్లీ ఎన్నికలు దళిత నేత ఆధ్వర్యంలో జరగబోవని నేను మీడియా ద్వారా తెలుసుకున్నా.''

- మాయావతి, బీఎస్​పీ అధినేత్రి

దేశంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన తొలి దళిత ముఖ్యమంత్రి (Dalit CM in India) మాయావతి కావడం గమనార్హం.

మీకు దమ్ముందా?

ఈ విమర్శల్ని అంతే దీటుగా తిప్పికొట్టింది కాంగ్రెస్​. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికి ఇప్పుడు.. ఎవరినైనా దళితుడిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా? అని సవాల్​ విసిరింది. భాజపానే ఉత్తర్​ప్రదేశ్​లో (UP BJP news) రాజకీయాలకు మతాన్ని పులుముతోందని ఎదురుదాడికి దిగారు.

''ప్రస్తుతం దేశంలో దళిత సీఎంగా ఉన్నది చరణ్​జిత్​ సింగ్​ చన్నీ మాత్రమే. ఈ దళిత సీఎంను టార్గెట్​ చేయడం భాజపాకు సంతోషంగా ఉన్నట్లుంది. కానీ.. ఆ పార్టీ ఒకదానికి జవాబివ్వాలి. ఓ దళితుడు ఉన్నత పదవిని అధిరోహిస్తే మీకెందుకు కడుపుమంట.''

- రణ్​దీప్​ సూర్జేవాలా, కాంగ్రెస్​ ప్రధాన ప్రతినిధి

చన్నీ ముఖ్యమంత్రిగా నియమించిన కాంగ్రెస్ (Congress news)​ నిర్ణయం.. చారిత్రకమని అన్నారు సూర్జేవాలా. ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. ఇంత ఎదిగిన చన్నీని చూసి గర్విస్తున్నామన్నారు.

'పైచేయి సాధించినా అది కష్టం'

చన్నీని సీఎంగా ప్రకటించి కాంగ్రెస్​ తన ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కుల సమీకరణాలే కీలకంగా నడిచే ప్రస్తుత దేశ రాజకీయాలను పరిశీలిస్తే.. ఆయనను ఉన్నత పదవి నుంచి తొలగించడం కష్టమని అంటున్నారు రాజకీయ నిపుణులు.

దీనిని బట్టి 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు (Assembly Election 2022) .. కుల సమీకరణాలు(Caste Politics) కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఇతర పార్టీలూ ఇదే ఎత్తుగడను అవలంబించవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆప్​ సహా బీఎస్​పీతో పొత్తు పెట్టుకున్న శిరోమణి అకాలీదళ్​.. పంజాబ్​లో అధికారంలోకి వస్తే దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని ప్రకటించాయి.

ఇటీవల గుజరాత్​లో భాజపా కూడా ముఖ్యమంత్రిని మార్చింది. ఇదీ ఎన్నికల స్టంట్​గానే అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. అక్కడ పాటీదార్​ వర్గం ఆధిపత్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. విజయ్​ రూపానీని తప్పించి భూపేంద్ర పటేల్​కు అవకాశం ఇచ్చిందని అంటున్నారు. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లో.. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు (2022 Assembly Election India) జరగనున్నాయి. మరి ఈ 'పంచతంత్రం'లో కుల సమీకరణాలు ఎలా మారతాయో.. రాజకీయాలు ఎలా నడుస్తాయో? ఎవరికి లాభిస్తాయో? అన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి: పంజాబ్​ 'మార్పు'తో.. కాంగ్రెస్​ అధిష్ఠానం చెప్పాలనుకునేది ఇదేనా?

మారుతున్న వ్యూహాలు- యూపీ, బిహార్లలో నయా కుల సమీకరణలు

UP news Election: ఆపరేషన్​ యూపీ.. 'పాంచ'జన్యం పూరించిన భాజపా

Assembly Election 2022: నాయకత్వ మార్పుతో ఎన్నికలకు సన్నద్ధం!

Vijay Rupani: విజయ్​ రూపానీ రాజీనామాకు అదే కారణమా?

Gujarat Cm: ఫస్ట్​టైం ఎమ్మెల్యే టు సీఎం.. భూపేంద్ర ప్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.