భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్!

author img

By

Published : Aug 24, 2021, 5:41 AM IST

Updated : Aug 24, 2021, 6:35 AM IST

suicide

తన భర్త చికెన్​ తిన్నాడని ఓ మహిళ ఆగ్రహానికి గురైంది. కోపం తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది.

శ్రావణమాసం(Shravan month) చివరిరోజున తన భర్త చికెన్ తిన్నాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

కరౌదా గ్రామానికి చెందిన రామ్​ జనమ్​ సింహ్ ఆగస్టు 22న రక్షాబంధన్​(Raksha Bandhan 2021) సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్​ తిన్నాడు. అయితే.. అది శ్రావణ మాసం చివరిరోజు. శ్రావణ మాసంలో(Shravan month 2021) చాలా మంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ, రామ్​ జనమ్​ చికెన్​ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్​ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

ఈ పరిణామాన్ని ఊహించని రామ్​ జనమ్​ సింహ్.. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే తన భార్య శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

మంటలను ఆర్పే క్రమంలో తన ఎడమ చేయికి కూడా నిప్పంటుకుందని రామ్​ జనమ్​ సింహ్ తెలిపాడు.

ఇదీ చదవండి:బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక- అత్యాచారమే కారణం

Last Updated :Aug 24, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.