ETV Bharat / bharat

ఆదివాసీల ట్రాక్టర్ బోల్తా- నలుగురు మృతి

author img

By

Published : Aug 9, 2021, 10:10 PM IST

Updated : Aug 9, 2021, 10:59 PM IST

tractor overturned
ట్రాక్టర్​ బోల్తా

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆదివాసీలకు తీరని విషాదం ఎదురైంది. ట్రాక్టర్​ బోల్తా పడి నలుగురు ఆదివాసులు మృతి చెందారు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు.

బోల్తాపడ్డ ఆదీవాసీల ట్రాక్టర్​

ఛత్తీస్​గఢ్ దంతెవాడ​లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆదివాసుల ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు.

tractor overturned
చెరువులో బోల్తా పడిన ట్రాక్టర్​

కటేక్యాలమ్ తాలుకా నుంచి 30 మంది ఆదివాసీలు.. హీరానగర్​లో జరగుతున్న ఆదివాసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తేలమ్, టేటా మధ్య ఉన్న ఓ చెరువులో ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది.

tractor overturned
బోల్తా పడ్డ ట్రాక్టర్​
tractor overturned
ట్రాక్టర్​ కిందపడ్డ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు

డీఆర్​జీ జవాన్లు..

ఈ ప్రమాద సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్​ రిజర్వ్​ గార్డ్(డీఆర్​జీ) సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ట్రాక్టర్​ కింద చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

tractor overturned
సహాయక చర్యలు

మృతదేహాలను స్థానిక అధికారులు... పోస్టు మార్టం కోసం తరలించారు. వారిని కోసా మాదవీ, దేశాయ్​ కావాసీ, దినేశ్​ మార్కమ్​, ఫూకే కావాసీగా అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: ఉగ్ర దాడిలో భాజపా సర్పంచ్ దంపతులు మృతి

Last Updated :Aug 9, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.