ETV Bharat / bharat

Chandrayaan 3 Latest Update : చంద్రుడిపై దుమ్మురేపిన విక్రమ్​ ల్యాండర్​.. ఏకంగా 2 టన్నుల మట్టి గాలిలోకి..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 4:20 PM IST

Updated : Oct 27, 2023, 4:39 PM IST

Chandrayaan 3 Latest Update : చంద్రయాన్​ 3లోని విక్రమ్​ ల్యాండర్​ 'దుమ్ము రేపింది'. చంద్రుడి ఉపరితలంపై దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి గాలిలోకి లేచి కిందపడింది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది.

Chandrayaan 3 Latest Update
Chandrayaan 3 Latest Update

Chandrayaan 3 Latest Update : భారత్​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​ 3లోని విక్రమ్​ ల్యాండర్​ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి గాలిలోకి లేచి కిందపడింది. ఈ క్రమంలోనే విక్రమ్​ ల్యాండర్ దిగిన చోట 108.4 మీటర్ల విస్తీర్ణంలో పేరుకుపోయిన మట్టిని చెల్లాచెదురు అయినట్లు వివరించింది ఇస్రో. ఈ సమయంలో ఎజెక్టా హలో అనే అద్భుత దృశ్యం సైతం ఆవిష్కృతమైందని చెప్పింది. థ్రస్టర్ల డీసెంట్​ ల్యాండింగ్​తో పాటు ఆ తర్వాతి ప్రక్రియ సమయంలో ఇలా జరిగిందని వివరించింది. ఆర్బిటార్​ హై రిజల్యూషన్ కెమెరా సహాయంతో ల్యాండింగ్​కు ముందు, తర్వాత అక్కడి పరిస్థితిని విశ్లేషించామని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలను ప్రకటించింది ఇస్రో.

  • Chandrayaan-3 Results:
    On August 23, 2023, as it descended, the Chandrayaan-3 Lander Module generated a spectacular 'ejecta halo' of lunar material.

    Scientists from NRSC/ISRO estimate that about 2.06 tonnes of lunar epiregolith were ejected and displaced over an area of 108.4 m²…

    — ISRO (@isro) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Landing Date : భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. చంద్రుడిపై సల్ఫర్ ఆనవాళ్లను గుర్తించింది ప్రజ్ఞాన్. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అనంతరం చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ అవి సఫలం కాలేదు. అయితే.. రోవర్ పని పూర్తైందని, అది మేల్కోకపోయినా నష్టం ఏమీ లేదని ఇస్రో స్పష్టం చేసింది.

ఆ ప్రాంతానికి శివశక్తి పాయింట్​గా పేరు
Chandrayaan 3 Shiv Shakti Point : మరోవైపు విక్రమ్ ల్యాండర్​ దిగిన ప్రాంతానికి "శివశక్తి పాయింట్" అని పేరు పెట్టింది భారత్​. దీంతో పాటు చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషిని గౌరవిస్తూ ఈ ప్రకటన చేశారు.

Lander And Rover Wake Up : చంద్రయాన్​-3 ల్యాండర్‌, రోవర్‌లకు ఇస్రో సంకేతాలు.. కొనసాగుతున్న పునరుద్ధరణ ప్రక్రియ..

Will Chandrayaan 3 Wake Up : జాబిల్లిపై సూర్యోదయం.. చంద్రయాన్-3 మళ్లీ పనిచేస్తుందా? నిద్రలేస్తే ఏం చేస్తారు?

Last Updated : Oct 27, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.