ETV Bharat / bharat

కేంద్రం 'ఆపరేషన్ ఆక్సిజన్'- ప్రతి జిల్లాకు ఒకరు!

author img

By

Published : Dec 22, 2021, 5:29 PM IST

Centre to train at least one 'Oxygen Steward' in each district nationwide
ఆక్సిజన్​ స్టీవార్డ్​, ఆక్సిజన్​ స్టీవార్డ్​షిప్​ ప్రోగ్రామ్​, Centre to train at least one 'Oxygen Steward' in each district nationwide

Oxygen Steward: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక 'ఆక్సిజన్​ స్టీవార్డ్​'ను నియమించే యోచనలో ఉంది. ప్రాణవాయువు వృథా అరికట్టే దిశగా పనిచేయడం సహా ఆక్సిజన్​ సరఫరాకు సంబంధించి అన్నీ వారే చూసుకునేలా శిక్షణ ఇవ్వనుంది.

Oxygen Steward: దేశంలో కరోనా రెండో దశ సమయంలో ప్రతి చోటా ఆస్పత్రుల్లో వినిపించిన మాట ఆక్సిజన్​ కొరత. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చున్న దృశ్యాలు కనిపించాయి. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి మొర పెట్టుకున్నాయి.

ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆక్సిజన్​ కొరత రాకుండా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఆక్సిజన్​ స్టీవార్డ్​'లను నియమించాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకరికి సంబంధిత శిక్షణ ఇచ్చే దిశగా ప్రణాళికలు చేసింది.

Oxygen Stewardship Program: నేషనల్​ ఆక్సిజన్ స్టీవార్డ్​షిప్​ ప్రోగ్రామ్​ను బుధవారం ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. భారతీ ప్రవీణ్​ పవార్​. ​ఈ కార్యక్రమంతో ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపడతాయని, ఆక్సిజన్​ కొరత తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు.

"ఆక్సిజన్ ప్రాణాలను కాపాడుతుంది. కొవిడ్-19 మాత్రమే కాకుండా ఎన్నో వ్యాధుల చికిత్సలో ఇది కీలకం. మహమ్మారి సమయంలో పెరిగిన ఆక్సిజన్​ డిమాండ్​ను దేశం చూసింది. అందువల్ల, ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా ఉపయోగించడం తప్పనిసరి.''

- డా. భారతీ ప్రవీణ్​ పవార్​, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి

Utilisation and Reducing Oxygen Wastage: ఆక్సిజన్ నిర్వహణలో నిమగ్నమై ఉన్న ఆస్పత్రి యాజమాన్యానికి, ఆరోగ్య సిబ్బందికి ప్రాణవాయువు వినియోగానికి సంబంధించి అవగాహన కల్పించడం సహా మెడికల్​ ఆక్సిజన్​ వృథాను నివారించే దిశగా ఈ స్టీవార్డ్​లు సాధికారత కల్పించాల్సి ఉంటుంది.

శిక్షణ పొందిన వ్యక్తులు ఆయా జిల్లాలకు సంబంధించి ఆక్సిజన్​ థెరపీ, నిర్వహణను ముందుండి చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

Omicron in India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరగుతున్నాయి. ఇప్పటివరకు 200పైనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 65 మందికిపైగా ఒమిక్రాన్​ సోకింది. జమ్ముకశ్మీర్​, ఒడిశాల్లోనూ మంగళవారం ఈ వేరియంట్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. దిల్లీ, తెలంగాణలోనూ ఒమిక్రాన్​ వ్యాప్తి కలవరపెడుతోంది.

ఈ వైరస్​ నివారణ దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి.

Karnataka Omicron Restrictions: కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలన్నారు.

ఇవీ చూడండి: India Corona cases: 575 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు

'బూస్టర్ డోసు ఎప్పుడు పంపిణీ చేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.