వంద మంది వలస కూలీలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్లోని ఖదీచా గ్రామానికి సమీపంలో ఉన్న ఆగ్రా-లఖ్నవూ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని బిల్హౌరీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. రాజస్థాన్ నుంచి బిహార్ వెళ్తున్న ఈ బస్సు టైర్ పేలడం వల్లే.. అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇదీ చూడండి: పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం