ETV Bharat / bharat

పెళ్లికి అడ్డొచ్చిందని లివిన్ పార్ట్​నర్ హత్య.. శవాన్ని సెప్టిక్ ట్యాంక్​లో పడేసి..

author img

By

Published : Jun 10, 2023, 5:22 PM IST

liv in relation woman murdered in prayagraj uttar pradesh
liv in relation woman murdered in prayagraj uttar pradesh

తనతో ఏడేళ్లు సహజీవనం చేసిన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం మృతదేహాన్ని సెప్టిక్​ ట్యాంక్​లో పడేశాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని.. మృతురాలు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. బీజేపీ నేత ఛాతీలో బుల్లెట్​ గాయాలతో తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మహారాష్ట్రలో తనతో సహజీవనం చేసిన ప్రియురాలిని ఓ కిరాతకుడు చంపిన ఘటన మరవకముందే అలాంటి దారుణం మరొకటి జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో తనతో ఏడేళ్లు సహజీవవం చేసిన మహిళను కడతేర్చాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటి సెప్టిక్​ ట్యాంక్​లో పడేశాడు. అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి.. ఏం తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్చన పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కుంజల్​వైశ్​ అనే గ్రామంలో రాజకేశర్​ అనే మహిళ నివసిస్తోంది. ఆమె తండ్రి చనిపోవడం వల్ల టైలరింగ్ చేసి.. తన చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. అయితే, ఏడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఆశిష్​ అలియాస్​ అరవింద్​తో రాజకేశర్​కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరి సహజీవనం ఏడేళ్ల పాటు సజావుగానే సాగింది. ఈ విషయం రాజకేశర్​ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు.

liv in relation woman murdered in prayagraj uttar pradesh
మృతురాలు రాజకేశర్

ఈ క్రమంలో అరవింద్​కు మరో మహిళతో మే 28న పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు రాజకేశర్​.. ఆ పెళ్లిని వ్యతిరేకించింది. ​దీంతో రాజకేశర్​ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అరవింద్​ పథకం పన్నాడు. అందులో భాగంగా మే 24న రాజకేశర్​ను నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి పిలిచాడు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే కొత్తగా నిర్మిస్తున్న సెప్టిక్​​ ట్యాంక్​లో పడేశాడు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై ఇసుక పోశాడు. ఆ తర్వాత సెప్టిక్​ ట్యాంక్​కు సిమెంట్​తో ప్లాస్టరింగ్​ చేయించాడు.

liv in relation woman murdered in prayagraj uttar pradesh
నిందితుడు అరవింద్

రాజకేశర్​ కనిపించకపోయే సరికి ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి.. ఆమె కోసం వెతితారు. ఎవరికీ అనుమానం రాకుండా అరవింద్​ కూడా వారితో కలిసి రాజకేశర్​ ఆచూకీ కోసం గాలించాడు. ఈ క్రమంలో మే 28న వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అరవింద్​ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాను పెళ్లి చేసుకోవడాన్ని రాజకేశర్ వ్యక్తిరేకించిందని.. అందుకే ప్లాన్​ ప్రకారం గొంతు కోసి చంపానని చెప్పాడు. జరిగిన విషయాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సెప్టిక్​ ట్యాంక్​లో పడేసిట్లు అంగీకరించాడు. ​

liv in relation woman murdered in prayagraj uttar pradesh
మృతదేహాన్ని పడేసిన సెప్టిక్​ ట్యాంక్​

బీజేపీ నేత మృతి.. ఛాతీలో బుల్లెట్​..
Nishant Garg Meerut : ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో దారుణం జరిగింది. బీజేపీ యువ మోర్చా మీడియా ఇంఛార్జ్​ నిశాంత్​ గార్గ్​.. ఛాతీలో బుల్లెట్​ గాయాలతో తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్​ బృందాన్ని కూడా పిలిపించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిశాంత్​ను అతడి చిన్నతనంలో అశోక్​పురిలో ఉండే ఆనంద్​ కుమార్​ గార్గ్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. నిశాంత్​.. సోనీ అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో సోనీపై నిశాంత్​ దాడి చేశాడు. దీంతో సోనీ శుక్రవారం వేకువజామున ఉదయం 3 గంటల సమయంలో తన పుట్టింటికి వెళ్లిపోయింది. కోపం తగ్గాక సోనీ సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి చేరుకునే సరికి.. ప్రధాన గేటు తెరిచి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై నిశాంత్​ పడి ఉన్నాడు. అతడి పక్క రివాల్వర్, కొంత దూరంలో మొబైల్​ పడి​ ఉన్నాయి. అనంతరం నిశాంత్​ను లేపడానికి సోనీ ప్రయత్నించింది. నిశాంత్​ ఎంతకూ లేవకపోవడం వల్ల తన భావ రింకూకు ఫోన్​ చేయగా.. అతడు అరగంటలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.