ETV Bharat / bharat

'బార్డర్​' బాబుకు వీసా మంజూరు.. స్వదేశానికి ఎప్పుడంటే?

author img

By

Published : Dec 9, 2021, 10:17 PM IST

BORDER
బార్డర్

child named as a Border: భారత్​-పాకిస్థాన్​ మధ్య 'బార్డర్​ బాయ్'గా పేరొందిన బుడ్డోడు గుర్తున్నాడా? అదేనండీ.. ఇరుదేశాల సరిహద్దులో జన్మించి.. అట్టారీ-వాఘా వద్ద చిక్కుకుపోయిన చిన్నారి. తన మాతృ దేశమైన పాకిస్థాన్​​కు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ఆ చిన్నారికి ఎట్టకేలకు వీసా మంజూరైంది. దీంతో వారి కుటుంబం పాక్​కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

A child named as a Border: భారత్-పాక్ సరిహద్దుల్లో పుట్టిన 'బార్డర్' అనే చిన్నారి కుటుంబానికి వీసా మంజూరైంది. దిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వారికి పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. పాక్​ నుంచి భారత్​లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి.. అనుకోకుండా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన పాక్ హిందూ కుటుంబం ఎట్టకేలకు స్వదేశానికి చేరనుంది. ఈ చిన్నారి కుటుంబానికి దిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా మంజూరు చేసింది.

BORDER
బార్డర్ పేరు ఉన్న చిన్నారి

లాక్​డౌన్​తో సరిహద్దుల్లో ఇరుక్కుపోయి..

పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులతో పాటు మరో 97 మంది పాకిస్థానీలు భారత్​కు వచ్చారు. ఆ తర్వాత కరోనా విజృంభించటం వల్ల లాక్​డౌన్​ విధించటం, పాక్​ సరిహద్దులు మూసివేయడం సహా సరైన పత్రాలు లేకపోవటం వల్ల అట్టారీ-వాఘా సరిహద్దుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బలమ్​ రామ్ అనే వ్యక్తి భార్య అయిన నింబు బాయి ఈ నెల 2న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూలీ పనులకు వెళ్లిన ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా.. సమీప గ్రామాల ప్రజలు వచ్చి పురుడు పోశారు. వైద్య సహాయం అందించారు.

BORDER
'బార్డర్' తల్లిదండ్రులు

మరో పిల్లాడికి 'భారత్​'గా నామకరణ

రెండోవేవ్​ లాక్​డౌన్​ కన్నా ముందు తమతో పాటు 98 మంది పాకిస్థానీ పౌరులు భారత్​కు వచ్చినట్లు బలమ్​ రామ్​ తెలిపారు. సరిహద్దులు మూసివేయటం వల్ల ఇక్కడే చిక్కుకుపోయామని చెప్పారు. పాకిస్థానీల్లో 47 మంది పిల్లలు సైతం ఉన్నారు. అందులో ఆరుగురు భారత్​లోనే జన్మించటం గమనార్హం.

BORDER
బార్డర్

లాగ్యా రామ్​ అనే వ్యక్తి సైతం తన కుటుంబంతో అట్టారీ సరిహద్దుల్లోనే నివసిస్తున్నారు. గత ఏడాదిలో జన్మించిన తన కుమారుడికి 'భారత్​'గా పేరు పెట్టారు. జోధ్​పుర్​లో తన సోదరుడిని కలిసేందుకు వచ్చిన లాగ్యా రామ్​ తిరిగి పాకిస్థాన్​కు వెళ్లలేక అట్టారీలో ఉంటున్నట్లు చెప్పారు.

సరిహద్దులోనే ఉండేందుకు కారణం?

భారత్​లో పుట్టిన పిల్లలకు పాస్​పోర్టులు కావాలని సరిహద్దు అధికారులు అడుగుతున్నారని, తమ వద్ద తినేందుకే డబ్బులు లేవని వాపోతున్నారు పాకిస్థానీలు. తమతో వచ్చిన వారు సొంత దేశానికి వెళ్లిపోతుంటే తాము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. తమను స్వదేశం పంపించేందుకు సహకరించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.