ETV Bharat / bharat

'నేతలంతా డబ్బులిచ్చి టీకా వేయించుకోవాలి'

author img

By

Published : Mar 2, 2021, 5:14 AM IST

పార్టీ నేతలంతా డబ్బులు చెల్లించి టీకా వేయించుకోవాలని భాజపా సూచించింది. నాయకులు తమ సొంత నియోజక వర్గాల్లో వచ్చే వారం టీకా తీసుకోవాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రెండోవిడత కరోనా వ్యాక్సినేషన్ మొదలుకాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు టీకా వేయించుకున్నారు.

BJP suggests to its ministers, leaders to get COVID shot
డబ్బులిచ్చి టీకా వేయించుకోవాలని నేతలకు భాజపా సూచన

పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు డబ్బులు చెల్లించి సొంత నియోజకవర్గాల్లో కరోనా టీకా వేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ సూచించింది. కొవిడ్ టీకాను ప్రైవేటు ఆసుపత్రుల్లో 250 రూపాయలు తీసుకుని వేసేలా ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతించిన నేపథ్యంలో ఈ మేరకు తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో వ్యాక్సిన్‌ తీసుకోవాలని నాయకులకు సూచించినట్లు పేర్కొన్నాయి.

రాంపూర్‌లో టీకా తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్ నఖ్వీ.. ఇందుకుగాను డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మరో 2 రోజుల్లో టీకా తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రెండోవిడత కరోనా వ్యాక్సినేషన్ మొదలుకాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు టీకా వేయించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిల్లీలోని మెదాంత ఆస్పత్రిలో టీకా వేయించుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: రెండో దశలో టీకా తీసుకున్న ప్రముఖులు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.