ETV Bharat / bharat

భాజపా ఎన్నికల కసరత్తు- బంగాల్​కు పరిశీలకులు

author img

By

Published : Dec 28, 2020, 9:53 AM IST

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చర్యలు ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పరిశీలకులు, సహ పరిశీలకులతో పాటు కన్వినర్లను నియమించింది.

bjp-appoints-district-observers-co-observers-for-west-bengal
బంగాల్ దంగల్: పరిశీలకులను నియమించిన భాజపా

బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పలు జోన్లకు పార్టీ పరిశీలకులను నియమించింది. అబ్జర్వర్లు, కో-అబ్జర్వర్లతో పాటు కన్వినర్ల జాబితాను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు.

ఇదీ చదవండి: బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

కోల్​కతా జోన్​కు సోవన్ ఛటర్జీని పరిశీలకుడిగా, దేబ్​జిత్ సర్కార్​ను కన్వినర్​గా నియమించింది భాజపా. బైసాక్షి బెనర్జీ, శంకుదేబ్ పాండాలను కో-కన్వినర్​లుగా నియమించింది. కూచ్ బెహర్ జిల్లాకు దీపెన్ ప్రమాణిక్, డార్జీలింగ్ జిల్లాకు భాస్కర్ దే, దక్షిణ దినాజ్​పుర్​కు అమితవా మైత్రా, ఉత్తర ముషీరాబాద్ జిల్లాకు మనబేంద్ర చక్రబర్తి, ఉత్తర నదియాకు గోపాల్ సర్కార్​, బసిర్​హాట్ జిల్లాకు ప్రదీప్ బెనర్జీ, ఉత్తర కోల్​కతాకు మానస్ భట్టాచార్యలను పరిశీలకులుగా నియమించింది.

ఇదీ చదవండి: బంగాల్​లో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్

డైమండ్ హార్బర్ జిల్లాకు సుభ్​నారాయన్, ఝాడ్​గ్రామ్​కు స్వపన్ పాల్, బర్దామ్ జిల్లాకు రామకృష్ణ పాల్, అసాన్సోల్ జిల్లాకు రామకృష్ణ రాయ్, అరాంబాగ్ జిల్లాకు దేబాశిష్ మిత్రాలను అబ్జర్వర్లుగా నియమిస్తూ ప్రకటన జారీ చేసింది భాజపా.

ఇదీ చదవండి: 'షా'ను కలవనున్న దాదా.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు!

సహ పరిశీలకులుగా మాల్డాకు శంకర్ చక్రబర్తి, దక్షిణ నదియాకు సందీప్ బెనర్జీ, కేఎన్ఎస్​డీకి ఫాల్గుణి పాత్ర, దక్షిణ కోల్​కతాకు బిజోయ్ ఓఝా, దక్షిణ 24 పరగణాలకు గౌతమ్ రాయ్, హావ్​డా అర్బన్​కు దినేష్ పాండే, హావ్​డా గ్రామీణ ప్రాంతానికి ప్రదీప్ దాస్​లను నియమించింది.

ఇదీ చదవండి: బంగాల్‌లో ఫిరాయింపుల జోరు- పరస్పర నిందారోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.