ETV Bharat / bharat

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. కాసేపు టెన్షన్​ టెన్షన్​.. చివరకు సేఫ్​గా..

author img

By

Published : Jan 29, 2023, 3:56 PM IST

విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్​ను అత్యవరంగా ల్యాండ్​ చేశారు అధికారులు. లఖ్​నవూ నుంచి కోల్​కతా వెళ్తుండగా జరిగిందీ ఘటన. మరోవైపు విమానంలో అత్యవసర ద్వారం​ కవర్​ను తొలగించేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. దీంతో అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంది ఎయిర్​లైన్స్​.

bird-hit-plane-and-flight-emergency-landing-in-uttarpradesh
ఉత్తర్​ప్రదేశ్​లో అత్యవసరంగా ల్యాండ్​ అయిన విమానం

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి కోల్​కతా వెళుతున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని లఖ్​నవూ ఎయిర్​పోర్ట్​లో అత్యవసరంగా ల్యాండ్​ చేశారు అధికారులు. ఫ్లైట్ i5-319 టేక్​ఆఫ్​ అవుతున్న సమయంలో పక్షి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని క్షుణ్నంగా పరీక్షించేందుకే ల్యాండ్​ చేసినట్లు వెల్లడించారు.

విమాన ప్రయాణికుడిపై కేసు..
మహారాష్ట్రలో విమాన ప్రయాణికుడిపై కేసు నమోదైంది. విమాన అత్యవసర ద్వారం కవర్​ను తొలగించేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. నాగ్​పుర్​ నుంచి ముంబయి వెళుతున్న 6E-5274 ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు కాసేపటి ముందు ఈ ఘటన జరిగింది.

"ఓ ప్రయాణికుడు విమానంలో అత్యవసర ద్వారం కవర్​ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం ప్రయాణికుడిని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ప్రయాణికుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాం." అని ఇండిగో ఎయిర్​లైన్స్ అధికారులు తెలిపారు. భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.