మూడు ఎకరాల భూవివాదం కేసులో 108 ఏళ్లకు తీర్పు.. మధ్యలో ఎన్నో ట్విస్టులు!

author img

By

Published : May 20, 2022, 1:35 PM IST

bihar court 108 years

Bihar court 108 years: మూడు ఎకరాల భూమిపై రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలై 108 ఏళ్లు గడిచాయి. మధ్యలో భారత్​కు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. దేశం రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ కేసు కోసం మూడు తరాల న్యాయవాదులు మారారు. ఎట్టకేలకు ఓ జడ్జి చొరవతో ఇప్పుడు తీర్పు వెలువడింది.

Bihar court 108 years: మూడు ఎకరాల భూమి కోసం రెండు కుటుంబాల మధ్య 108 ఏళ్లు సాగిన వివాదానికి... బిహార్​లోని ఓ కోర్టు ఎట్టకేలకు తెరదించింది. భూమిని కొనుగోలు చేశామని చెబుతున్న అతుల్ సింగ్​ కుటుంబానికే ఆ ఆస్తి చెందుతుందని భోజ్​పుర్​ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇన్నేళ్లుగా ప్రభుత్వం అధీనంలో ఉన్న ఆ భూమిని విడిపించుకునేందుకు.. పిటిషన్​ దాఖలు చేసిన వారి వారసులకు అనుమతి ఇచ్చింది.

1914లో మొదలు: వివాదాస్పద భూమి కొయిల్వార్ నగర్ పంచాయతీ పరిధిలో ఉంది. నాథుని ఖాన్ అనే వ్యక్తి నుంచి అతుల్​ సింగ్​ ముత్తాత దర్బారీ సింగ్​ ఆ భూమిని కొనుగోలు చేశారు. 1911లో నాథుని ఖాన్​ మరణించాక సమస్య మొదలైంది. ఖాన్ ఆస్తులపై తమకే యాజమాన్య హక్కు ఉంటుందంటూ అతడి కుటుంబసభ్యులు తమలో తామే గొడవపడ్డారు. ఫలితంగా.. ఖాన్​కు చెందిన 9 ఎకరాల ఎస్టేట్​లో భాగమైన ఈ మూడెకరాలపైనా వివాదం నెలకొంది. ఫలితంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆస్తిని జప్తు చేసింది.

దర్బారీ సింగ్ 1914లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ భూమిని తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, తనకే దక్కాలని చూడాలని కోరారు. దర్బారీ సింగ్ తరఫున అప్పట్లో న్యాయవాది శివ్​రథ్​ నారాయణ్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ తర్వాత పిటిషనర్, న్యాయవాది ఇద్దరూ మరణించారు. వారి వారసులు న్యాయపోరాటం కొనసాగించారు. శివ్​రథ్​ కుమారుడు భద్రీ నారాయణ్ సింగ్ కేసు బాధ్యతలు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. చివరకు.. ఆయన కుమారుడు సతేంద్ర సింగ్​ ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అతుల్​ సింగ్​కు న్యాయం జరిగేలా చేశారు.

"జడ్జి శ్వేతా సింగ్​ ఓపికను మెచ్చుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను పరుగులు తినేశాయి. అయినా ఆమె జాగ్రత్తగా వాటిని పరిశీలించారు. మార్చి 11న తీర్పు ఇచ్చారు. నా క్లయింట్ అతుల్ సింగ్.. తహసీల్దార్​ను కలిసి భూమిని విడిపించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఒక అసాధారణ కేసు. నాథుని సింగ్​ కుటుంబసభ్యులు ఎవరూ ఇప్పుడు ఇక్కడ లేరు. దేశ విభజన సమయంలో వారు పాకిస్థాన్​ వెళ్లిపోయారు. మా క్లయింట్లు ఈ కేసును నాలుగు తరాలు పోరాడారు. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావడం సంతృప్తిని ఇచ్చింది." అని చెప్పారు న్యాయవాది సతేంద్ర సింగ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.