ETV Bharat / bharat

రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్​!

author img

By

Published : Nov 5, 2020, 4:40 PM IST

Updated : Nov 5, 2020, 5:30 PM IST

బిహార్​లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే తనకు చివరివని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఓ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

This is my last election, says Bihar CM and JD(U) Chief Nitish Kumar during an election rally in Purnia
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్​

రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్​!

మరో రెండు రోజుల్లో బిహార్​ ఎన్నికల సమరం ముగుస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తన చివరి ఎన్నికలని పేర్కొన్నారు.

పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నితీశ్​. బిహార్​ ఎన్నికల ప్రచారాలకు గురువారం చివరి రోజు అని.. తనకు కూడా ఇదే చివరి ఎన్నిక అని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

69ఏళ్ల నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్​లో ఎంపీగా 7సార్లు ఉన్నారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్​లో ఈ నెల 7న చివరి దశ పోలింగ్​ జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- 35 ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 6 సార్లు సీఎం!

Last Updated : Nov 5, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.