ETV Bharat / bharat

'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి..  మరో 5,537 మందికి వైరస్

author img

By

Published : Jul 1, 2020, 8:47 PM IST

Tamil Nadu
తమిళనాడులో కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ​ రాష్ట్రాల్లో కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 5వేల500లకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో దాదాపు నాలుగువేల కేసులు బయటపడ్డాయి.

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, గుజరాత్​ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5.85 లక్షలు దాటింది. మరణాలు 17,400కు చేరాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 5,537 మందికి వైరస్​ సోకింది. మరో 198 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. ఇప్పటి వరకు 93,154 మంది వైరస్​ కోలుకున్నారు. 79,075 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8053కు చేరింది.

తమిళనాడులో...

తమిళనాడులో బుధవారం ఒక్కరోజే 3,882 మంది కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరగా.. మరణాలు 1,264కు చేరాయి. ఇప్పటి వరకు 52,926 మంది కోలుకున్నారు. 39,856 మంది చికిత్స పొందుతున్నారు.

దిల్లీలో...

దేశ రాజధాని దిల్లీలో వైరస్​ కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం 2,442 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 61 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 89,802, మరణాలు 2,803కు చేరాయి. ఇప్పటి వరకు 59,992 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 27,007 మంది చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలో...

కర్ణాటకలో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం 1272 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే 735 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసులు 16,524, మరణాలు 253కు చేరాయి.

గుజరాత్​లో..

గుజరాత్​లో బుధవారం 675 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 33,318, మరణాలు 1869కి చేరగా.. 24,038 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు.

హరియాణాలో..

హరియాణాలో వైరస్​ విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 393 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 14,941కి చేరింది.

బంగాల్​లో...

పశ్చిమ బంగాలో బుధవారం మరో 611 మందికి వైరస్​ సోకింది. 15 మంది మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 19,170కి చేరగా.. మృతుల సంఖ్య 683గా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 65.35 శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.