ETV Bharat / bharat

కరోనా అధిక సంక్రమణకు సాన్నిహిత్యమే కారణం!

author img

By

Published : May 26, 2020, 5:44 AM IST

coronavirus has higher transmission rate
కరోనా అధిక సంక్రమణ రేటు!

కరోనా వైరస్​ అధిక సంక్రమణ రేటుకు మనుషుల మధ్య దగ్గరి సాన్నిహిత్యమే కారణమని నిర్ధరించింది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​). ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన 23 మంది ఇటాలియన్లు, 3 భారతీయులకు కరోనా సోకిన విధానంపై పరిశోధనల తర్వాత ఈ విషయం వెల్లడించింది.

కరోనా మహమ్మారి అధిక సంక్రమణ రేటుకు మనుషుల మధ్య సాన్నిహిత్యమే (దగ్గరి పరిచయాలు) కారణమని నిర్ధరించింది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​). వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతికు దూరం పాటించటం, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నియంత్రణ చర్యలు తప్పనిసరిగా అనుసరించాలని తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన ఇటలీ దేశస్థుల్లో కరోనా వైరస్​ సంక్రమణ ఫలితాలను అధ్యయనంలో పేర్కొంది ఐసీఎంఆర్​. దగ్గరి పరిచయాల్లో ముందస్తు లక్షణాలు, కరోనా లేని కేసులు గుర్తించినట్లు తెలిపింది. సామాజిక సంక్రమణను నిరోధించేందుకు పాజిటివ్​ రోగులను ముందస్తుగా గుర్తించటం,నిర్బంధించడం, పరీక్షించడం చాలా ముఖ్యమని పేర్కొంది.

16 మంది ఇటాలియన్లు, ఒక భారతీయుడికి కరోనా సోకిన విషయంపై గత మార్చి-ఏప్రిల్​ మధ్య పరిశోధన చేపట్టారు. దీనిపై ఐసీఎంఆర్​ చేసిన అధ్యయనం.. ఇండియన్​ జర్నల్​ ఆఫ్​ మెడికల్​ రీసర్చ్​ (ఐజేఎంఆర్​)లో ప్రచురితమైంది.

" డైమండ్​ ప్రిన్సెస్​ నౌక (19.2శాతం), గ్రాండ్​ ప్రిన్సెస్​ నౌక (16.6శాతం)తో పోలిస్తే సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం​లో వెల్లడైంది. 8 రోజులు సగటున 6 గంటల పాటు కలిసి ప్రయాణించటం వల్ల అధిక సంక్రమణ రేటు ఉండొచ్చు. ఇండెక్స్​ కేసు తప్ప ఇతర కేసుల్లో పరీక్ష సమయంలో లక్షణాలు లేవు. సుమారు సగం పాజిటివ్​​ కేసుల్లో చికిత్స కొనసాగినన్ని రోజులు లక్షణాలు లేవు. దగ్గరి పరిచయాల్లో కొవిడ్​-19 పరీక్షలు.. లక్షణాలు లేని కేసులను గుర్తించి, నిర్బంధించటానికి దారి తీశాయి. దాని ద్వారా మరింత సంక్రమణను అడ్డుకోగలం. లక్షణాలు కనబడిన, తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారిలో.. కోలుకునే సగటు 33.3 శాతంగా ఉంది. కరోనా ప్రభావానికి గురైన క్లస్టర్​లో మరణాలు, కేసుల నిష్పత్తి 11.5 శాతంగా ఉంది. "

– ఐసీఎంఆర్​

17 మందికి...

గత ఫిబ్రవరి 21న 23 మంది ఇటాలియన్​ పర్యటకులు, ముగ్గురు భారతీయులు దిల్లీకి చేరుకున్నారు. రాజస్థాన్​లోని పలు పర్యటక ప్రాంతాలను సందర్శించారు. అందులో ఒక 69 ఏళ్ల ఇటాలియన్​ ఫిబ్రవరి 29న జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది లక్షణాలతో జైపుర్​లోని ఎస్​ఎంఎస్​ వైద్య కళాశాలలో చేరాడు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్​గా తేలింది. అతని భార్యకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా సోకింది. ఇద్దరిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

మిగతా 24 మంది మార్చి 2న ట్రైన్​లోని ఒకే కంపార్ట్​మెంట్​లో దిల్లీకి పయణమయ్యారు. అనంతరం వారిని క్వారంటైన్​ చేశారు. తొలుత వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారి నోటి కఫం, నాసిక వ్యర్థాలను తీసుకుని పరీక్షించగా 14 మంది ఇటాలియన్​, ఒక భారతీయుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. మార్చి 3 వరకు 26 మందిలో 17 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. సంక్రమణ రేటు 64.4 శాతంగా ఉంది. 17 మందిలో 9 మందికి లక్షణాలు లేవు. ఆరుగురిలో స్వల్ప జ్వరం రాగా, ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.