ETV Bharat / bharat

'వ్యాక్సిన్​' పిటిషన్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

author img

By

Published : Oct 29, 2020, 2:19 PM IST

కరోనా వ్యాక్సిన్​ పేరుతో పలురకాల మందుల అమ్మకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు న్యాయవాది ఎం.ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

SC issues notice to Centre on plea alleging Remdesivir, Fabiparivir are used to treat COVID-19 without proper approval
కొవిడ్​ వ్యాక్సిన్​  అమ్మకపు కంపెనీలపై  విచారణ చేపట్టిన సుప్రీం

కొవిడ్​ వ్యాక్సిన్​ పేరుతో జరుపుతున్న పలురకాల మందుల అమ్మకాలపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రెమిడెసివిర్​, ఫావిపిరవిర్​ వంటి ధ్రువీకరించని ట్రయల్​ మందులకు సంబంధించిన 10 ఫార్మా కంపెనీలపై విచారణ చేపట్టాలని న్యాయవాది ఎం.ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది న్యాయస్థానం.

అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మందులను కరోనా రోగులకు వాడాలన్ననిబంధనను గుర్తుచేస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు శర్మ. ఈ విషయంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. డబ్ల్యూహెచ్​ఓ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి- గుజరాత్​ మాజీ సీఎం కేశుభాయ్​ పటేల్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.