ETV Bharat / bharat

రాజస్థాన్​ రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

author img

By

Published : Jul 15, 2020, 12:48 PM IST

Updated : Jul 15, 2020, 4:18 PM IST

ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​పై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సచిన్​ పైలట్​ బృందానికి మరో షాక్ తగిలింది. వారందరిపై అనర్హత వేటు వేయాలని పార్టీ కోరిన నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు స్పీకర్​ సీపీ జోషి. శుక్రవారం లోపు సమాధానం ఇవ్వాలని కోరారు.

Rebel MLAs face disqualification from Rajasthan Assembly
రాజస్థాన్​ రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

రాజస్థాన్​లో​ రాజకీయ సంక్షోభానికి తెరలేపిన సచిన్​ పైలట్​ బృందానికి మరో షాక్​ తగిలింది. ఇప్పటికే పదవుల నుంచి తప్పించిన కాంగ్రెస్.. అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరింది. కాంగ్రెస్​ ఫిర్యాదు మేరకు సచిన్​ పైలట్​తో పాటు ఆయన మద్దతుదారులు అందరికీ నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్​ సీపీ జోషి. శుక్రవారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

పైలట్​తో పాటు 18 ఎమ్మెల్యేలు విప్​ను ధిక్కరించి పార్టీ శాసనసభ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం, మంగళవారం జరిగిన సమావేశాలకు హాజరుకానందున సచిన్​ పైలట్​పై వేటు వేసింది పార్టీ. ఉప ముఖ్యమంత్రి సహా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పైలట్​తో వెళ్లిన విశ్వేంద్ర సింగ్​, రమేశ్​ మీనాను మంత్రివర్గం నుంచి తొలగించింది.

"సీఎల్​పీ సమావేశానికి హాజరుకాని పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్​ సీపీ జోషీకి పార్టీ ఫిర్యాదు చేసింది. నోటీసులకు సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారు."

- అవినాశ్​ పాండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

రాజస్థాన్​ కాంగ్రెస్​కు గోవింద్​ సింగ్​ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. త్వరలోనే పార్టీ కార్యనిర్వహక, వివిధ విభాగాలు నియమిస్తామని పాండే తెలిపారు.

కొత్తగా నియమితమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి లేకుండా ఏ ఒక్క కాంగ్రెస్​ సభ్యుడూ మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది అధిష్ఠానం.

ఇదీ చూడండి: నేను భాజపాలో చేరడం లేదు: సచిన్​ పైలట్

Last Updated : Jul 15, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.