ETV Bharat / bharat

గహ్లోత్​ సర్కార్​కు షాక్​- పైలట్​ వర్గానికి ఊరట

author img

By

Published : Jul 24, 2020, 11:28 AM IST

Updated : Jul 24, 2020, 3:33 PM IST

RAJASTHAN HIGH COURT VERDICT
గహ్లూత్​ సర్కార్​కు షాక్​- పైలట్​ వర్గానికి ఊరట

12:23 July 24

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టులో గహ్లోత్​ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు.  

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్​ ఫిర్యాదు నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలకు​ అనర్హత నోటీసులు పంపించారు స్పీకర్​ సీపీ జోషి. స్పీకర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యేలు. పిటిషన్​ను విచారించిన కోర్టు సభాపతి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.  

హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు స్పీకర్​ జోషి. అయితే.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించలేమని, స్పీకర్​ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

11:25 July 24

గహ్లోత్​ సర్కార్​కు షాక్​- పైలట్​ వర్గానికి ఊరట

  • రాజస్థాన్: సచిన్ పైలట్ వర్గ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
  • ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశం
  • గతంలో కాంగ్రెస్‌ ఫిర్యాదుతో 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు
  • స్పీకర్ నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేసిన సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు
  • అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్‌కు సూచించిన హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్పీకర్
  • రాజస్థాన్ స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Last Updated :Jul 24, 2020, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.