ETV Bharat / bharat

'వసుంధర మద్దతు వల్లే గహ్లోత్ ప్రభుత్వం కూలలేదు'

author img

By

Published : Oct 10, 2020, 11:00 AM IST

రాజస్థాన్​లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోకుండా ఉండటానికి వసుంధరా రాజే(భాజపా) 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చారని రాష్ట్రీయ లోక్​తంత్రిక్ పార్టీ ఆరోపించింది. రాజస్థాన్​లో గహ్లోత్, వసుంధర పొత్తులు ఏర్పరచుకున్నారని చెప్పుకొచ్చింది.

Sachin Pilot news
'వసుంధర మద్దతు వల్లే గహ్లోత్ ప్రభుత్వం కూలలేదు'

రాజస్థాన్​లో రాజకీయ ప్రతిష్టంభన సమసిపోయిన నెలల తర్వాత అక్కడి రాష్ట్రీయ లోక్​తంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని గహ్లోత్ సర్కార్ కూలిపోకుండా ఉండేందుకు కారణం వసుంధర రాజె అని వ్యాఖ్యానించింది.

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె పొత్తు కుదుర్చుకున్నారని ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి సచిన్ పైలట్ బయటకు వచ్చిన సమయంలో తన(ఆర్ఎల్పీ) పార్టీ ఆయన(సచిన్) వెంటే ఉందని తెలిపారు.

అయితే వసుంధరా రాజే మాత్రం ముఖ్యమంత్రి గహ్లోత్​కు 20 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారని అన్నారు బెనివాల్. అందువల్లే ప్రభుత్వం కూలిపోలేదని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.