ETV Bharat / bharat

'మహా' భవనం కూలిన ఘటనలో 16కు చేరిన మృతులు

author img

By

Published : Aug 25, 2020, 5:35 PM IST

Updated : Aug 26, 2020, 9:56 AM IST

మహారాష్ట్ర రాయ్​గఢ్​లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు.

Raigad building collapse
శిథిలాల తొలగింపు

మహారాష్ట్ర రాయ్​గఢ్​లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. భవన శిథిలాల కింది నుంచి చాలా మందిని కాపాడారు ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది. వీరిలో ఓ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Raigad building collapse
కుప్పకూలిన భవనం

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్​​ ఫారూక్​ కాజీ, ఆర్కిటెక్ట్ గౌరవ్ షాపై 304, 304ఏ, 338 కింద అభియోగాలు మోపారు.

Raigad building collapse
శిథిలాల తొలగింపు
Raigad building collapse
కూలిన భవనం

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచనల మేరకు మంత్రి ఏకనాథ్ శిందే మహద్​కు చేరుకున్నారు. ఉదయం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు శిందే.

Raigad building collapse
కొనసాగుతున్న సహాయక చర్యలు
Raigad building collapse
శిథిలాలను తొలగిస్తున్న ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది

ఇదీ చూడండి: మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంస్తుల భవనం

Last Updated : Aug 26, 2020, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.