ETV Bharat / bharat

రాజమాత జ్ఞాపకార్థం నాణెం విడుదల చేసిన మోదీ

author img

By

Published : Oct 12, 2020, 12:09 PM IST

గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధిగాంచిన భాజపా నేత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా.. ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సింధియా.. తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ కీర్తించారు.

Prime Minister Narendra Modi releases a commemorative coin of Rs 100 in honour of Rajmata Vijaya Raje Scindia
రాజమాత జ్ఞాపకార్థం నాణెం విడుదల చేసిన మోదీ

గ్వాలియర్​ రాజమాతగా పేరొందిన భాజపా నేత విజయరాజే సింధియా జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజమాత జయంతి సందర్భంగా ఆమె పేరు, ముఖచిత్రంతో ముద్రించిన రూ.100 నాణాన్ని వర్చువల్ కార్యక్రమం ద్వారా ఆవిష్కరించారు.

Modi releases a commemorative coin of Rs 100 Rajmata Vijaya Raje Scindia
విజయరాజే సింధియా జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం

రాజమాత సింధియా తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ ఈ సందర్భంగా కీర్తించారు. ప్రజలకు ప్రాతినిథ్యం వహించడాన్ని అధికారంలా కాకుండా.. సేవగా భావించారని పేర్కొన్నారు. ముమ్మారు తలాక్ చట్టం తీసుకురావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో రాజమాత ఆశయాలను దేశం మరింత ముందుకు తీసుకెళ్లిందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.