ETV Bharat / bharat

'గల్వాన్' వీర పుత్రులకు యుద్ధ స్మారకం

author img

By

Published : Oct 3, 2020, 2:44 PM IST

గల్వాన్​లో చైనా సైన్యంతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకం నిర్మించారు. దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.

New war memorial built for 20 Galwan warriors who caused heavy casualties to Chinese Army
గల్వాన్ వీర పుత్రులకు యుద్ధ స్మారకం

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మ ఘటనలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన 20 మంది సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేసింది భారత సైన్యం. లద్దాఖ్​లోని దుర్బుక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద ఈ మెమోరియల్​ను నిర్మించింది.

స్మారకంపై 20 మంది సైనికుల పేర్లతో పాటు జూన్ 15న జరిగిన ఆపరేషన్ వివరాలు పొందుపర్చారు.

"2020 జూన్ 15న గల్వాన్​ లోయలో కమాండింగ్ అధికారి కర్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని సైనిక బృందం పీఎల్​ఏ అవుట్​పోస్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జనరల్ ఏవై నాలా నుంచి పెట్రోలింగ్ పాయింట్ 14(పీపీ 14) వరకు అవుట్ పోస్టును తరలించేందుకు ప్రయత్నించారు. ఈ పనిని విజయవంతంగా ముగించి పీపీ 14కి చేరుకున్నారు. అక్కడ భారత సైన్యానికి పీఎల్​ఏ దళాలకు మధ్య భీకర పోరు జరిగింది. కర్నల్ సంతోష్ బాబు తన బృందాన్ని ముందుండి నడిపించారు. పీఎల్ఏ సైన్యంతో పోరాటం చేసి భారీ ప్రాణనష్టం కలిగించారు."

-స్మారకంపై రాసి ఉన్న వివరాలు

మే నెల నుంచి భారత్, చైనా సైన్యాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫింగర్ ఏరియాలతో పాటు, గల్వాన్ లోయ, హాట్​ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా ప్రాంతాల్లో చైనా సైన్యం చొరబాట్లకు ప్రయత్నించింది. గల్వాన్​లో జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇప్పటివరకు ఎన్ని చర్చలు జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు.

ఇదీ చదవండి- బాలాసోర్​లో శౌర్య క్షిపణి​ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.