ETV Bharat / bharat

'ఉత్తర భారతంలో ఈ ఏడాది వర్షాల జోరు.. కానీ'

author img

By

Published : Jun 1, 2020, 5:07 PM IST

ఉత్తర భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారత్​లో తక్కువగా నమోదవుతుందని పేర్కొంది.

Monsoon arrives in Kerala, North India likely to receive above normal rainfall
ఉత్తర భారత్​లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే మధ్య భారత్​, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది.

ఉత్తర భారత్​లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

తూర్పు, ఈశాన్య భారత్​తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించినట్లు తెలిపిన ఐఎండీ.. జూన్​-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 75 శాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి:'వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.