ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Jun 16, 2020, 6:55 AM IST

Updated : Jun 16, 2020, 9:54 AM IST

jammu
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

09:51 June 16

కశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మంగళవారం వేకువజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లా తుర్క్‌వాంగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే మృతిచెందారు.  

సంఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్స్‌ స్థావరానికి కేవలం 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే ఉంది. గత పది రోజుల వ్యవధిలో ఉగ్రవాదుల ఏరితేతపై ఇది నాలుగో ఆపరేషన్‌. షోపియాన్‌ జిల్లాలో ఈ నెలలో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 19 మంది ముష్కరులు హతమయ్యారు.

భారత్ లక్ష్యంగా పాక్ కాల్పులు..

మరోవైపు పాక్‌ సైన్యం తమ వక్రబుద్ధి చాటుకుంటోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తంగ్దార్‌ సెక్టార్‌లో సరిహద్దు మీదుగా మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం వీటిని దీటుగా తిప్పికొడుతోంది.  

07:25 June 16

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

తుర్క్​వాంగమ్​ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఆపరేషన్​ కొనసాగుతోంది.  

06:51 June 16

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా తుర్క్​వాంగమ్​ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్​ కొనసాగుతోంది.

Last Updated : Jun 16, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.