ETV Bharat / bharat

దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 61 వేల కేసులు

author img

By

Published : Oct 6, 2020, 9:55 AM IST

Updated : Oct 6, 2020, 11:10 AM IST

కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 61,267 కేసులు నమోదయ్యాయి. మరో 884 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 66.85 లక్షలకు చేరింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 8 కోట్ల కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

INDIA CASES
ఇండియా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా 70 వేలకు పైగా నమోదవుతున్న కేసులు.. తాజాగా 62 వేల లోపునకు పడిపోయాయి.

కొత్తగా మరో 61,267 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మరో 884 మంది మరణించారు.

INDIA CASES
కాస్త తగ్గిన కేసులు

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 56 లక్షలకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 13.75 శాతం ఉండగా.. మరణాల రేటు 1.55 శాతానికి చేరింది.

INDIA CASES
ఏ రాష్ట్రాల్లో కేసులు ఎలా..?

ఆగస్టు 7న దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షల మార్క్ అందుకుంది.

ఎనిమిది కోట్ల పరీక్షలు

సోమవారం ఒక్కరోజే 10,89,403 టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 8,10,71,797 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.

INDIA CASES
8 కోట్లు దాటిన కరోనా నిర్ధరణ పరీక్షలు
Last Updated : Oct 6, 2020, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.