ETV Bharat / bharat

'మోదీ.. ధైర్యముంటే హాంకాంగ్​​ గురించి మాట్లాడండి'

author img

By

Published : Oct 10, 2019, 8:09 PM IST

Updated : Oct 10, 2019, 8:20 PM IST

భారత్​ అంతర్గత విషయాలలో తలదూర్చకుండా చైనాను అడ్డుకోవడంలో మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​ పరిస్థితులను గమనిస్తున్నామని చైనా చెబుతోన్నా.. భాజపా ప్రభుత్వం డ్రాగన్​ దేశం వద్ద హాం​కాంగ్​ గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శనాస్త్రాలు గుప్పించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ.

'మోదీ.. ధైర్యముంటే హాంగ్​కాంగ్​ గురించి మాట్లాడండి'

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో పరిస్థితులను ఎప్పటికప్పుడు చైనా గమనిస్తోందని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​ పదేపదే చెబుతూనే ఉన్నారు. అయితే చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాజాగా మోదీ ప్రభుత్వాన్నివిమర్శించింది హస్తం పార్టీ. కశ్మీర్​ను గమనిస్తున్నామని జిన్​పింగ్​ చెబుతుంటే... భాజపా సర్కారు హాం​కాంగ్​ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. హాం​కాంగ్​లో చైనాకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్​ కూడా హాం​కాంగ్​ను గమనిస్తోందని జిన్​పింగ్​కు మోదీ సర్కారు ఎందుకు చెప్పలేకపోతోందని విమర్శించింది.

భారత్​ అంతర్గత విషయాలలో చైనా తలదూర్చకుండా అడ్డుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ ఆరోపించారు.

if-xi-says-china-is-watching-kashmir-then-why-does-pm-not-say-we-are-watching-hk-cong
మనీశ్ తివారీ ట్వీట్

"కశ్మీర్​ను గమనిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ చెబుతున్నారు. అయితే హాం​కాంగ్​లో జరుగుతున్న ప్రజా నిరసనలు, జింజియాంగ్​లో మానవహక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రం, టిబెట్​లో జరుగుతున్న అణచివేత వంటి విషయాలను తాము కూడా గమనిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ ఎందుకు చెప్పడం లేదు."
- మనీశ్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఆక్సాయిచిన్ గురించి మాట్లాడండి

అలాగే మోదీ సర్కారుకు ధైర్యముంటే.. పాక్​ అక్రమంగా చైనాకు అప్పగించిన అక్సాయిచిన్​ గురించి జిన్​పింగ్​తో మాట్లాడాలని తివారీ ట్వీట్​ చేశారు.

if-xi-says-china-is-watching-kashmir-then-why-does-pm-not-say-we-are-watching-hk-cong
మనీశ్ తివారీ ట్వీట్

"పాక్​ ఆక్రమిత కశ్మీర్​, గిల్గిట్-బాల్టిస్థాన్​ను తిరిగి చేజిక్కించుకోవడంపై భాజపా నేతలందరు గొప్పగా మాట్లాడుకుంటున్నారు, కానీ 1963లో పాకిస్థాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన ఆక్సాయిచిన్​ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై ఒక్కరూ మాట్లాడటం లేదు. ఆక్సాయిచిన్ తిరిగి తీసుకోవడంపై జిన్​పింగ్​తో ప్రధాని మోదీ మాట్లాడతారా?"
-కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ

Digital Advisory
Thursday 10th October 2019
Clients, please note that all media activity at the NBA China game between Los Angeles Lakers and Brooklyn Nets in Shanghai today has been cancelled.
We hope to offer a reaction piece from fans.
Regards,
SNTV
Last Updated : Oct 10, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.