భారత్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్'. దీని కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది ఇస్రో. ఇప్పుడు ఈ నలుగురిని శిక్షణ కోసం రష్యాకు పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. వచ్చేవారం నుంచి 11 నెలల పాటు అక్కడే ఉంటారని స్పష్టం చేశారు.
"రష్యాలో 11 నెలల శిక్షణ ముగిసిన తర్వాత వ్యోమగాములు.. భారత్లో మాడ్యూల్-స్పెసిఫిక్ శిక్షణలో పాల్గొంటారు. వీరితో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా ఇస్రో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది."
-జితేందర్ సింగ్, కేంద్ర మంత్రి.
గగనయాన్ ప్రాజెక్ట్ కోసం 10 వేల కోట్లను వెచ్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని 2018లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.
2022లో గగనయాన్ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యోమగాములను అంతరక్షంలోకి మోసుకొని వెళ్లనుంది.
ఇదీ చూడండి: 'హిజ్బుల్' ఉగ్రమూకపై పోరులో కీలక విజయం