ETV Bharat / bharat

దిల్లీ కాలుష్యంపై విదేశీ రాయబారుల ఆందోళన

author img

By

Published : Nov 6, 2019, 7:03 PM IST

దిల్లీ కాలుష్యంపై విదేశీ రాయబారుల ఆందోళన

దిల్లీ... దేశ రాజధాని. కానీ... ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శ్వాస సంబంధిత సమస్యలతో అక్కడి ప్రజానీకం ఆస్పత్రుల బాట పడుతోంది. ఈ పరిస్థితుల్లో దిల్లీలో ఉండే వేర్వేరు దేశాల రాయబారులు ఏమనుకుంటున్నారు? కాలుష్య భూతం నుంచి తప్పించుకునేందుకు ఏం చేస్తున్నారు?

కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని దిల్లీలో నేడు కాస్త పరిస్థితి చక్కబడింది. తీవ్ర వాయుష్య కాలుష్యం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే దిల్లీలో ఏటా ఇదే సమయానికి వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తోందని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో పర్యావరణ అంశాలపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు తెలిపారు డిప్లొమాటిక్ ​కార్ప్స్​ డీన్​ ఫ్రాంక్ హెచ్​డీ కాస్టెల్లానోస్​. ఈ వారమే జరిగే భేటీలో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై అధికారులతో సమాలోచనలు చేయనున్నట్లు తెలిపారు.

"దిల్లీ ప్రజలు పీల్చే గాలినే ఇక్కడి దౌత్యవేత్తలు పీల్చుకుంటారు. అందరి గురించి ఆందోళనగా ఉంది. పరిస్థితిని నియంత్రించేందుకు ఏం చేయాలనే విషయంపై విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమవుతాం. కాలుష్యం కారణంగా దిల్లీ వాసులతో పాటు ఇక్కడికి పర్యటన, వ్యాపార పనుల కోసం వచ్చే విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు."
-ఫ్రాంక్ హెచ్​డీ కాస్టెల్లానోస్​, డిప్లోమాటికి కార్ప్స్​ డీన్​.

2017లోనే కాలుష్యంపై నిరసన

దిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా 2017లోనే భారత్​కు దౌత్య ప్రతినిధుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. వాయు కాలుష్యం వల్ల దౌత్య కార్యాలయాల సిబ్బంది తమ విధులను సజావుగా నిర్వర్తించలేక పోతున్నట్లు అప్పట్లోనే విదేశాంగ శాఖకు నివేదించారు హెచ్​డీ కాస్టెల్లానోస్.

వాయు నాణ్యత క్షీణంచి తమ సహోద్యోగులు, కుటుంబసభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని పలు ఎంబసీలు, హై కమిషన్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఆగ్నేయ ఆసియా కూటమి సభ్యుల్లోని ఇద్దరు దౌత్యవేత్తలు.. దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన సమయంలో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. మరికొందరు తమ షెడ్యూల్​ను మార్చుకోవాలనుకున్నారు.

భారత్​లో పోస్టింగ్​ను క్లిష్టతరమైనదిగా ప్రకటించాలని 2017లో తమ ప్రభుత్యానికి లేఖ రాసింది థాయిలాండ్​ రాయబార కార్యాలయం. కోస్టారికాకు చెందిన రాయబారి మరేలా క్రజ్​ అల్వారెజ్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి దిల్లీలో విధులు నిర్వహించే తమ దేశాల ప్రతినిధులకు, సిబ్బందికి ముందు జాగ్రత చర్యల కింద పలు ఏర్పాట్లు చేస్తున్నాయి విదేశీ రాయబార కార్యాలయాలు.

మాస్క్​లు, ఎయిర్ ​ప్యూరిఫయర్​లు..

ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తమ సిబ్బంది కోసం తీసుకున్న కాలుష్య నియంత్రణ చర్యలను ఈటీవీ భారత్​కు వివరించారు అధికారిక ప్రతినిధి రెమీ తిరౌట్టవరాయనే. 2016లో దిల్లీలోని ఫ్రెంచ్​ దౌత్య కార్యాలయంలో ఎయిర్ ప్యూరిఫయర్స్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతవారం రెండు దేశాల పర్యావరణ శాఖ మంత్రులు సమావేశమై... వాతావరణ మార్పు వంటి అంశాలపై చర్చించినట్లు గుర్తుచేశారు రెమీ.

దిల్లీలో పనిచేసే తమ దేశ రాయబార కార్యాలయ సిబ్బందికి గత కొన్నేళ్లుగా ఫేస్ మాస్క్​లను, ఎయిర్​ ప్యూరిఫయర్స్​​ను అందుబాటులో ఉంచింది చైనా. అయితే డ్రాగన్ దేశంలా అందరికీ ఇవి అందుబాటులో ఉండవన్నారు జర్మన్ రాయబారి వాల్టర్​ లిండర్​. దిల్లీలో రిక్షా నడుపుకుని జీవనం కొనసాగించే కార్మికులు... మాస్క్​లు, ఎయిర్ ప్యూరిఫయర్స్​​ కొనుగోలు చేయలేరని చెప్పారు.

సరి-బేసికి మద్దుతు

వాయు కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి విధానాన్ని సమర్థించారు వాల్టర్​. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఇలాంటి నూతన పద్ధతులు పాటించడం సబబేనని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కాలుష్య నింయత్రణకు తీసుకునే ఏ చర్యనైనా స్వాగతించాలన్నారు.

దిల్లీ గేటు వద్ద నిరసన

వాయు కాలుష్యంపై నిరసనగా దిల్లీ గేటు వద్ద నిన్న నిరసనలు చేపట్టారు హస్తిన, ఇతర ప్రాంతాల వాసులు. కాలుష్య నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-(స్మితా శర్మ, సీనియర్​ పాత్రికేయురాలు)

ఇదీ చూడండి: 'తీస్​ హజారీ' వివాదం: మూడో రోజూ న్యాయవాదుల సమ్మె

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0253: South Korea US AP Clients Only 4238383
US official hails 'encouraging' Japan-SKO meeting
AP-APTN-0158: US MD Chicken Sandwich Stabbing Presser Part Must credit WJLA; No access Washington DC market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive/Part Must Credit Prince George's County Police Department 4238381
Police seek to ID suspect in fatal stabbing
AP-APTN-0118: New Zealand Millane Trial No Access New Zealand 4238380
Trial of suspect in Millane murder continues in NZ
AP-APTN-0112: New Zealand Millane Court No access New Zealand 4238373
Family of murdered UK backpacker at NZ court
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.