ETV Bharat / bharat

ఆరు నెలలకు సరిపడా రేషన్​తో దిల్లీకి రైతులు!

author img

By

Published : Jan 29, 2021, 7:11 PM IST

రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కన్నీటి ప్రసంగం తమను కదిలించింది అంటున్నారు హరియాణా రైతులు. ఆందోళనలకు మద్దతుగా దిల్లీ సరిహద్దులకు తరలి వెళ్తున్నట్టు తెలిపారు.

HR_HIS_01_NARNOUND_KISAAN_VISBYTE_10016
ఆరు నెలలకు సరిపడా నీటి ట్యాంకర్లతో దిల్లీ సరిహద్దులకు

రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ భావోద్వేగ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైతులను చైతన్యపరిచిందని, స్ఫూర్తి నింపిందని హరియాణా రైతులు తెలిపారు. దీంతో మరోసారి ఆందోళనలకు సిద్ధమైనట్టు తెలిపారు. హరియాణాలోని అనేక జిల్లాల నుంచి దిల్లీకి పయనమయ్యారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దిల్లీ సరిహద్దులకు తరలిన హరియాణా రైతులు

ఆహార సామగ్రితో..

హిసార్ జిల్లాలోని నార్నంద్, రాజ్‌తల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు కనీసం 6 నెలలకు సరిపడా ఆహార సామగ్రితో దిల్లీ సరిహద్దులకు బయలుదేరారు.

రైతు ఉద్యమాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కుట్రలకు రైతులు భయపడరు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది.

-రైతులు

ఇదీ చదవండి: ట్రాక్టర్ ర్యాలీలో హింసపై కీలక ఆధారాలు సేకరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.