ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

author img

By

Published : May 30, 2020, 7:59 AM IST

Updated : May 30, 2020, 9:46 AM IST

encounter
కశ్మీర్​లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

09:43 May 30

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్​లోని కుల్గాం జిల్లా వాన్​పొరా ప్రాంతంలో​ జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

07:57 May 30

కశ్మీర్​లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా​ కుల్గాం జిల్లాలో భద్రత దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.   

దక్షిణ కశ్మీర్​లోని కుల్గాం జిల్లా వాన్​పొరా ప్రాంతంలో ముష్కర మూకలు ఉన్నాయన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. జవాన్ల రాకను గమనించిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీనికి భద్రతా బలగాలు దీటుగా సమాధానమిస్తున్నాయి. 

Last Updated :May 30, 2020, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.