దేశ రాజధాని ప్రాంతంలోని నొయిడాలో కరోనా భయంతో స్థానికంగా మాస్క్లతో పాటు చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్స్కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా అన్ని షాపుల్లోనూ మాస్క్ల కొరత ఏర్పడింది. వీటికి తోడు వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. సాధారణంగా రూ.10కే దొరికే సర్జికల్ మాస్క్ ధర.. ప్రస్తుతం రూ.40పైనే ఉంది. అలాగే ఎన్95 రకం మాస్క్ల ధర రూ.150 నుంచి ఏకంగా రూ.500కు చేరింది.
నొయిడాలో కరోనా అనుమానిత కేసు నమోదైందనే వార్త.. ఇవాళ ఉదయం మీడియాలో ప్రసారమైన అనంతరం మాస్క్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా సగటున రోజుకు 10-15 మాస్క్లు అమ్మే ఫార్మసీల్లో.. నేడు ఆ సంఖ్య 100-200కు చేరింది. ప్రత్యేకించి కరోనాను అరికట్టేందుకు వైద్య నిపుణులు సూచించిన ఎన్95 మాస్క్లకే ఎక్కువ డిమాండ్ నెలకొంది.