ETV Bharat / bharat

తమిళనాట 10 వేలు దాటిన కరోనా మరణాలు

author img

By

Published : Oct 8, 2020, 7:50 PM IST

Updated : Oct 8, 2020, 11:03 PM IST

CORONA DEATH TOLL REACHES 10,000 MARK IN TAMILANADU, WITH 68 NEW FATALITIES
కొవిడ్​ మరణ మృదంగం- తమిళనాట 10వేలు దాటిన మృతులు

దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 68లక్షల మందికిపైగా వైరస్​ సోకింది. వారిలో లక్షా 5వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాట కరోనా మృతుల సంఖ్య 10వేలు దాటింది. అటు దిల్లీలోనూ కొవిడ్​ కేసుల సంఖ్య 3లక్షల మార్క్​కు ఎగబాకింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. తమిళనాడులో కొత్తగా 5,088 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 6,40,943కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి కొత్తగా 68 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 10,052కు చేరింది. ఫలితంగా దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రాలలో రెండోస్థానంలో నిలిచింది.

  • మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 13,395 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాధితుల సంఖ్య 14,93,884కు పెరిగింది. వైరస్​ సోకిన వారిలో మరో 358 మంది చనిపోయారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39,430కు చేరింది.
  • కేరళలో మరో 5,445 మంది కొవిడ్​ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 2లక్షల 60వేలకు సమీపించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 900మందికిపైగా కరోనాతో మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 3,376 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,27,459కి పెరిగింది. వైరస్​ కారణంగా మరో 45 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 6,245కు చేరింది.
  • దిల్లీలో కొత్తగా 2,726 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. కొవిడ్​ కారణంగా మరో 37 మంది మరణించగా.. చనిపోయిన వారి సంఖ్య 5,616కు పెరిగింది.
  • రాజస్థాన్​లో మరో 2,138 కరోనా కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1,52,605కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,605 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీపై స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు!

Last Updated :Oct 8, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.