ETV Bharat / bharat

కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9,016 కేసులు

author img

By

Published : Oct 17, 2020, 7:46 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ పలు రాష్ట్రాల్లో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో మరో 9,016 మంది కరోనా బారిన పడ్డారు. తమిళనాడులో 4,286 కేసులు నమోదవగా.. రాజస్థాన్​లో 1,992 కొత్త కేసులు గుర్తించారు.

corona cases recording high in few states of india
కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9,016 కేసులు

కేరళలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,016 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 96,004కి చేరింది. ఇప్పటివరకు 1,139 మంది వైరస్​కు బలయ్యారు. 2లక్షల 36వేల 989 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో

కర్ణాటకలో కొత్తగా 7,184 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 71మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 58వేల 574కు చేరింది. మృతుల సంఖ్య 10,427గా ఉంది.

తమిళనాడులో..

తమిళనాడులో మరో 4,295 మందికి పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో 57మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 83వేల 486కు చేరింది. మరణాల సంఖ్య 10,586కు పెరిగింది. 6లక్షల 32వేల 708 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

రాజస్థాన్​లో కొత్తగా నమోదైన 1,992 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1లక్ష 71వేల 281కి చేరింది. ఇప్పటివరకు 1,735 మంది చనిపోయారు. ప్రస్తుతం 21,255 యాక్టివ్ కేసులున్నాయి.

మిజోరాంలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో 2,245 మంది బాధితులున్నారు. ప్రస్తుతం 108మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.