ETV Bharat / bharat

కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 5వేల కేసులు

author img

By

Published : Oct 19, 2020, 7:59 PM IST

కేరళలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 5వేల 22 కేసులు నమోదయ్యాయి. మరో 21మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మరో 5,016మందికి పాజిటివ్​గా తేలింది. తమిళనాడులో కొత్తగా 3,536మంది వైరస్ బారినపడ్డారు.

corona cases decreasing in few states of india
కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. కేరళలో కొత్తగా 5,022మందికి పాజిటివ్​గా తేలింది. మరో 21మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 92,731గా ఉంది.

  • కర్ణాటకలో మరో 5,018 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 64మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,70,604కి చేరగా..మరణాల సంఖ్య 10,542కి పెరిగింది.
  • తమిళనాడులో కొత్తగా 3,536 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 49మంది వైరస్ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,90,936కి పెరిగింది. మరణాల సంఖ్య 10,691గా ఉంది. 6,42,152 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • దిల్లీలో కొత్తగా నమోదైన 2,154 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 3,33,171కి చేరింది. ఇప్పటివరకు 6,040మంది మరణించారు.
  • రాజస్థాన్​ మరో 1,960 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 15 మంది చనిపోయారు. 20,893 యాక్టివ్ కేసులున్నాయి.
  • జమ్ముకశ్మీర్​లో ఒక్కరోజులో 427 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 88,369కి పెరిగింది. మరణాల సంఖ్య 1,388కి చేరింది.
  • మణిపుర్​లో 315 కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,778కి చేరగా.. మరణాల సంఖ్య 117గా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.