ETV Bharat / bharat

తప్పుడు కేసు పెట్టినందుకు 15 లక్షల జరిమానా

author img

By

Published : Nov 21, 2020, 5:18 PM IST

Updated : Nov 21, 2020, 5:25 PM IST

తమిళనాడులో ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో చెన్నై సివిల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధితుడిపై ఫిర్యాదు చేసిన మహిళ రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Chennai City Civil court
చెన్నై సివిల్ కోర్టు

తప్పుడు ఫిర్యాదు చేసిన ఓ మహిళకు చెన్నై సివిల్ కోర్టు రూ.15 లక్షల జరిమానా విధించింది.

తమిళనాడు చెన్నైకి చెందిన సంతోష్.. పక్కింటి యువతితో ప్రేమలో పడ్డాడు. వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. అయితే, వీరి మధ్య ఓ భూవివాదం సమస్యకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సంతోష్ కుటుంబం వేరే చోటుకు మకాం మార్చారు.

ఆరేళ్లకు విడుదల..

తర్వాత.. యువతిపై సంతోష్​ అత్యాచారం చేశాడని ఆమె తల్లి కేసు పెట్టింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సంతోష్​ను పోలీసులు అరెస్టు చేశారు. 95 రోజుల తర్వాత అతనికి బెయిల్ లభించింది. ఈ మధ్యలో ఆ యువతి.. బిడ్డకు జన్మనిచ్చింది. డీఎన్​ఏ పరీక్షల్లో సంతోష్ అత్యాచారం చేయలేదని తేలింది. ఫలితంగా 2016లో కోర్టు కేసు కొట్టివేసింది.

పరిహారానికి డిమాండ్..

తనపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతి తల్లి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సివిల్​ కోర్టులో పిటిషన్​ వేశాడు సంతోష్. ఆరేళ్ల కాలంలో తన చదువుతో పాటు న్యాయపోరాటానికి రూ.2 లక్షలు ఖర్చు అయిందని పిటిషన్​లో పేర్కొన్నాడు.

సంతోష్​ వాదనలు విన్న సివిల్ కోర్టు.. యువతి తల్లిని రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: ఛాటింగ్​ చేస్తోందని సోదరిని కాల్చేశాడు!

Last Updated : Nov 21, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.