ETV Bharat / bharat

కట్టుదిట్టమైన భద్రత నడుమ బిహార్​ ఓట్ల లెక్కింపు!

author img

By

Published : Nov 8, 2020, 8:23 PM IST

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్​ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అధికారులు. కరోనా నిబంధనలతో పటిష్ఠమైన భద్రత నడుమ మొత్తం 55 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

55 counting centres, 78 CAPF cos, CCTVs: All set for Nov 10 as Bihar awaits poll results
బిహార్​లో చురుగ్గా సాగుతున్న కౌంటింగ్​ పనులు

బిహార్​లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 38 జిల్లాల్లో మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. తూర్పు చంపారన్, గయా, శివన్, బెగుసరాయ్ జిల్లాలలో మూడేసి చొప్పున.. మిగతా జిల్లాలలో ఒకటి లేదా రెండేసి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

మూడంచెల భద్రత

కేంద్ర సాయుధ బలగాలు, బిహార్ మిలిటరీ పోలీస్, జిల్లా పోలీసులతో.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 19 కంపెనీల సీఏపీఎఫ్​ బలగాలు మోహరించనున్నాయి. కౌంటింగ్ అనంతరం శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా.. మొత్తం 59 సీఏపీఎఫ్​ బృందాలు భద్రతా చర్యలు చేపట్టనున్నాయి.

కరోనా నిబంధనలు తప్పనిసరి

కొవిడ్ దృష్ట్యా అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్​ కేంద్రాల్లో ప్రవేశించేందుకు మాస్కుల నిబంధన తప్పనిసరి చేసిన అధికారులు.. శానిటైజర్లనూ అందుబాటులో ఉంచనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ముగిసిన బిహార్​ సమరం- ఎగ్జిట్​ పోల్స్​ ఎవరివైపు?

బిహార్ బరి:‌ పోలింగ్​ పూర్తయింది.. ఫలితమే మిగిలుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.