ETV Bharat / bharat

బెయిల్​ కోసం సుప్రీంకోర్టుకు అర్ణబ్​​​ గోస్వామి

author img

By

Published : Nov 10, 2020, 4:05 PM IST

బాంబే హైకోర్టు బెయిల్​ తిరస్కరించడం వల్ల రిపబ్లిక్‌ టీవీ ఛానల్‌ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​​​ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య కేసులో పోలీసులు అర్ణబ్​ను అరెస్ట్​ చేశారు.

Arnab Goswami moves SC against Bombay HC order refusing interim relief in 2018 suicide case
బెయిల్​ కోసం సుప్రీంకోర్టుకు అర్ణబ్​ గోస్వామి

బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్​​‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అర్ణబ్​​‌​‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్‌ పోలీసులు నవంబర్‌ 4న అరెస్ట్​ చేశారు.

అర్ణబ్​​‌​ తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముంబయి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఇలా ఉంటే బాంబే హైకోర్టు సూచన మేరకు కింది న్యాయస్థానం అయిన రాయ్‌గఢ్​ సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: అర్ణబ్​ గోస్వామికి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.