ETV Bharat / bharat

మహారాష్ట్రలో మరో 7,717మందికి సోకిన మహమ్మారి

author img

By

Published : Jul 28, 2020, 7:34 PM IST

Updated : Jul 28, 2020, 8:28 PM IST

దేశంలోనే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 7,717 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 282 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 91వేలు దాటింది. ఇప్పటివరకు 14వేల 165మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కొత్తగా 6,972 మంది, కర్ణాటకలో మరో 5,536 మంది వైరస్ బారినపడ్డారు.

6,972 new #COVID19 cases and 88 deaths reported in Tamil Nadu today.
తమిళనాడులో కొత్తగా 6,972 కరోనా కేసులు

కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 7,717 కేసులు వెలుగుచూశాయి. మరో 282మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,91,440కి చేరింది. ఇప్పటివరకు 14,165 మంది మృతిచెందారు. 2లక్షల 32వేల మందికిపైగా వ్యాధి నుంచి కోలుకున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 6,972 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 88మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. మృతుల సంఖ్య 3,659కి పెరిగింది. వైరస్ బారినపడినవారిలో 1,66,956మంది కోలుకున్నారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 5,536 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 102మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కు చేరగా.. మరణాల సంఖ్య 2,055కి పెరిగింది.

యూపీలో భారీగా..

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరో 3,458 మంది వైరస్​ బారినపడ్డారు. 24 గంటల్లో 41మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,951కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,497కి చేరింది. ఇప్పటి వరకు 20లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

దేశరాజధానిలో..

దిల్లీలో కొత్తగా 1,056 మందికి వైరస్ సోకింది. మరో 28మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,32,275కి చేరగా.. మృతుల సంఖ్య 3,881గా నమోదైంది.

కేరళలో..

కేరళలో కొత్తగా నమోదైన 1167 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 20,896 పెరిగింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

జమ్ముకశ్మీర్​లో 489..

జమ్ముకశ్మీర్​లో 24 గంటల్లో 489మందికి పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 18,879కి చేరింది. ఇప్పటివరకు 333మంది వైరస్​కు బలయ్యారు.

అరుణాచల్​ ప్రదేశ్​లో 81...

అరుణాచల్​ ప్రదేశ్​లో మరో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1239కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు నిందితుల వాంగ్మూలం నమోదు పూర్తి

Last Updated : Jul 28, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.