బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై దాఖలైన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారించనుంది. అయోధ్య వాసులు హాజీ మహ్మూద్ అహ్మద్, సయ్యద్ అఖ్లాఖ్ అహ్మద్ గతేడాది సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ నెల 8న పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో పిటిషనర్ల తరపున ఆల్ ఇండియా ముస్లి పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫార్యద్ జిలానీ వాదనలు వినిపించనున్నారు.