ETV Bharat / bharat

బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంక్​ గల్లంతు.. లాభించింది వారికే..

author img

By

Published : Mar 10, 2022, 8:47 PM IST

BSP
బీఎస్​పీ మాయావతి

UP politics: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం సింగిల్​ డిజిట్​కు మాత్రమే పరిమితం అయ్యింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అధికారం చేపట్టిన బీఎస్పీకి ఈ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. క్యాడర్​ అంతా అధికార, ప్రతిపక్ష పార్టీలకు తరలిపోగా.. అదే సందేహాంతో ఓటరు అధికార భాజపాను అందలం ఎక్కించారు.

UP politics: మూడు దశాబ్దాల ప్రస్థానం, ఒకసారి అత్యధిక సీట్లతో అధికారం, కేవలం దళిత అనే ముద్రతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన బీఎస్పీ అధినేత్రి మాయవతి మార్కు రాజకీయం ఈ ఎన్నికల్లో ఎక్కడా ఇసుమంత అయినా కనిపించలేదు. సంప్రదాయ ఓటు బ్యాంక్​ కూడా నేడు వెలుబడిన ఫలితాలతో గల్లంతు అయినట్లు స్పష్టమవుతోంది.

గత ఎన్నికల్లో సుమారు 21 శాతం మేర ఉన్న బీఎస్పీ ఓటు షేర్​.. ఈ సారి దారుణంగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో 12.73 శాతానికి పరిమితం అయ్యింది. 2017 ఎన్నికల్లో 19 సీట్లను గెలుచుకున్న బీఎస్పీ నేడు సింగిల్​ డిజిట్​తో సరిపెట్టుకుంది.

2007లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఎస్పీ.. ఆ సమయంలో 206 సీట్లతో పాటు 30.43 శాతం ఓట్లను పొందింది. అత్యంత బలమైన ఓటు బ్యాంక్​ను.. అనంతరం జరిగిన పరిణామాలతో మాయావతి కాపాడుకోలేకపోయింది. సంక్షేమ పథకాల ద్వారా అధికార భాజపా తమకు సాయం చేస్తుందని భావించిన సగటు ఓటరు బీఎస్పీని విడిచి భాజపా వైపు అడుగులు వేశాడు. కమలం పార్టీ అంటే పడని మరికొందరు ప్రత్యమ్నాయంగా ఉన్న ఎస్పీని ఎంచుకున్నారు. దీంతో బీఎస్పీకి ఉన్న కోర్​ క్యాడర్​ పూర్తిగా దెబ్బతింది.

బీఎస్పీలో కీలకంగా ఉన్న నేతలైన ఇంద్రజీత్ సరోజ్, లాల్జీ వర్మ, రామ్ అచల్ రాజ్‌భర్, త్రిభువన్ దత్ వంటి వారు మాయవతి విధానాలు నచ్చక.. ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరారు. ఈ చర్యలతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు డైలమాలో పడ్డారు. ఈ సమయంలో వారికి ప్రత్యమ్నాయంగా ఉన్న ఎస్పీ, భాజపాకు తరలిపోయారు. ఈ క్రమంలోనే యాదవేతర ఓబీసీలతో పాటు, జాతవ్​ వేతర దళితులను హిందుత్వం పేరుతో భాజపా సొంత చేసుకోగలిగిందని విశ్లేషకులు చెప్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఈ సమయంలో ఎస్పీ కంటే బీఎస్​పీనే ఎక్కువ సీట్లు సంపాదించింది. ఈ సమయంలో బీఎస్పీ 10 సీట్లు గెలుచుకోగా, ఎస్పీ ఐదు సీట్లు గెలుచుకుంది. అనూహ్యంగా మాయావతి ఈ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న బీఎస్పీ ఓటరు.. అధికారంలో ఉన్న భాజపాకు మాయావతి దగ్గర అవుతోందని భావించాడు.

తాజాగా వెలుబడిన ఫలితాలను.. 2007 ఎన్నికలతో పోల్చితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. సోషల్​ ఇంజనీరింగ్​ పేరుతో వచ్చిన మాయావతి బ్రాహ్మణులను పార్టీలోకి ఆకట్టుకోలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:

రాజకీయం లెక్కలు మార్చిన మినీ సమరం- 2024లో ఏం జరగనుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.