ETV Bharat / bharat

కుమారుడికి అడ్మిషన్​ ఇవ్వలేదని బాంబు బెదిరింపు​!

author img

By

Published : Jun 22, 2021, 10:25 AM IST

కుమారునికి పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వలేదని ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి బెదిరింపు మెయిల్​ పెట్టాడు ముంబయిలోని ఓ వ్యక్తి. అతన్ని పుణెలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

Mantralaya bomb case
మంత్రాలయా బాంబు కేసు

ముంబయిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో బాంబు పెట్టామని నకిలీ ఈమెయిల్​ పంపిన శైలేష్​ షిండే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలోని ఘోర్పాడి ప్రాంతంలో అతన్ని అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

తన కుమారుడిని పాఠశాలలో చేర్చుకోకపోవడం కారణంగా నకిలీ ఈ మెయిల్​ను పంపినట్లు ఇన్​స్పెక్టర్​ కోలేకర్​ తెలిపారు. అతనిపై ముంబయిలోని మెరైన్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైందని తెలిపిన ఆయన.. అక్కడి పోలీసులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో ఇలా బెదిరింపు ఈ మెయిల్ రావడం ఇది రెండోసారి అని అన్నారు.

ఇదీ చూడండి: దేవభూమిలో ఆలయాలపై రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.